పుట:Bhaarata arthashaastramu (1958).pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాడించు సూత్రధారులు వార. మ్యానేజరులు సయితము వ్యవహార కళాకుశలులుగ నుండుట యుక్తము.

'కార్నెగీ' యను కోటీశ్వరుడు నొక్కి వక్కాణించినట్లు "ప్రజ్ఞావంతులకు వెలయేలేదు. సంబళమెంత యిచ్చినను వారిచే నధికోత్పత్తి సిద్ధించుంకావున సరాసరికి నయమేకాని వ్యయముగాదు. మందుడైనవా డుచితముగ వచ్చెదనన్నను దానిచే నష్టము తప్పదు. కావున కూలితక్కువగదాయని నిష్ప్రయోజకుల నియోగించుటకన్న నెక్కువ కూలియిచ్చి చతురుల జేర్చుకొనుటయ మేలు." ఇందునకు దృష్టాంత ముగా, 'కార్నెగీ' గారే లండనులో తమకు బ్రతినిధియైనవానికి, ఏటకు 75000 రూపాయలిచ్చెదరు! 75000 రూపాయలనగా నీ బ్రిటీష్ రాజ్యతంత్రమంతయు నడుపు ప్రధానమంత్రి కేర్పడియుండు జీత మంత! బొంబాయిలో ప్రత్తిశాలవారు కొందఱు తమ మ్యానేజరులకు నెలకు రెండువేల రూపాయలిచ్చె దరు. 'రాకి పెల్లరు', 'మార్గన్‌' మొదలైన యపారవ్యాపారుల మంత్రులకు మన జమీన్‌దారుల కన్న నెక్కువ యాదాయమున్నది. ఇట్లిచ్చుట దుర్వ్యయమా? కాదు. ఏలన, కూలికి మించిన పనితేలెనేని కూలి యధికమని యెట్లు చెప్పవచ్చును! మంచివస్తువు గావలయునన్న మంచివెల యీయ వలయును. అట్లుగాక దానధర్మముగావచ్చి నావద్ద పాటు పడుడీయని బ్రతిమాలుట పేడిమాటగాని మగతనపు లక్షణముగాదు. దానధర్మముల నాశించి బ్రతుకువానికి నికృష్టములేకాని యుత్కృష్టములు దక్కవు. అట్టి యెంగిలి బ్రతుకునకన్న చావు మంచిది!