పుట:Annamacharya Charitra Peetika.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

94 కడపజిల్లాలో ముడుంపాడు, ఊటకూరు, మాచనూరు, రాజుపాలెం, ఎజ్ఞవారిపాలెం అనుగ్రామములో(గూడఁ దాళ్ళపాకవారు పెదతిరుమలా చార్యుల యయిదుగురు కుమాళ్ళ వంశపరంపరలవారు ఉన్నారట. శ్రీసూర్యనారాయణయ్యగా రాయాగ్రామముల కరిగియక్కడి విశేముల దెలిసికొనివచ్చిరి. మణి కొన్ని విగ్రహాదులు ముడుంపాడు గ్రామమునఁ గల వని తెలుపఁగా వాని సేకరింపగోరి వారి నాగ్రామమున కంపితిని. కాని వారు విగ్రహముల నీయరంురట. గ్రంథములు శిథిల మయి పోయినవట. తాళ్ళపాకవారి యిండ్లనుండి (కడపజిల్లా) కొన్నితాళపత్ర గ్రంథము లాంధ్రసాహిత్యపరిషత్తువారు సేకరించిన టున్నారు. (చూ.6 వాల్యుం. పరిషత్పత్రిక) నందవరీకులు-వైష్ణవత అన్నమయు యూదివE శఠకోపయతిశిష్యుఁడై వైష్ణవుఁడైనట్టే యూకాలమున నందవరీకట్రాహ్మణులు మజీకొందఱు వైష్ణవము స్వీకరించి శఠకోపయతిశిష్యులయిరి. అల్లసాని పెద్దనకూడ నందవరీకబ్రాహ్మణుఁడే, స్మారుఁడే. శఠకోవయుతిశిష్యుఁడై వైష్ణవము పుచ్చుకొన్నాఁడు. ప్రబంధరాజవిజయు వేంకటేశ్వరవిలాసమురచించిన గణపవరపు వెంకటకవికూడ నందవరీకుఁడీ. వారి పూర్వులు వైష్ణవము పుచ్చుకొన్న వారే! కాని యూతఁడు తాళ్ళపాక వారికిఁ జాలఁ దర్వాతివాఁడు శ్రీవెంకటేశ్వరస్వామిపై నాతఁడు రచించినకృతి వెంకటేశ్వరవిలాస మాతఁ డన్నటు ప్రబంధరాజమే, నందవరీకులు గొందఱు వైష్ణవులగుటకుఁ బ్రధానముగా నన్నమాచార్యుఁడే కారణ మనుకొందును ఆరాధ్యశైవుఁడగు తెనాలి రామకృష్ణుఁడు వైష్ణవుఁడగుటకుఁ గూడ నీతాళ్లపాకవారి పలుకుబడి కలదేమో. ఆతని కృతిపతి విరూరివేదాద్రిమంత్రి నందవరబ్రాహ్మణుఁడేమో. విరూరి' యింటిపేరివారు నందదవరీకులు నేఁడున్నారట. రామకృష్ణుని గురువగు కందాడ అప్పలాచార్యుడు తాళ్ళపాక పెదతిరుమలాచార్యునకును గురువు. కాన పెదతిరుమలయ్య రామకృష్ణుఁడు సతీర్యులు. 13