పుట:Andrulasangikach025988mbp.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారాయణకవి ఒకచో తాయెతు నిట్లు పేర్కొన్నాడు.

          "సరిపెణతో సజ్ఞబలు సందిటి తాయెతు
           లంగవస్త్రము.............." (5-99)

బాలికలు ఆడుకొను ఆటలు ప్రత్యేకముగా ఉండెను.

నాచన సోమన మొదలుగా నారాయణకవి వరకు వాటిని పేర్కొనుచు వచ్చినారు. హంసవింశతిలో ఇట్లు తెలిపినారు.

          "బొమ్మల పెండ్లిండ్లు బువ్వంపు బంతులు
           పుణికిళ్ళు నిట్టిక్కి బొమ్మరిండ్లు......" (5-147)

(అభిలాషులు పూర్తి పద్యమును చూచుకొనగలరు. ఈ మాలికలో అతి విపులముగా ఆటలన్నింటిని కూర్చినాడు. కావున నిది చాలా ముఖ్యమైన పద్యము.)

రాటముపై వడకుట ఇంకా విరివిగానే ఉండెను. దాని ముచ్చట పలు తావులలో హంసవింశతిలో కలదు.

ధనాడ్యులైనవారు చలివేంద్రలు పెట్టి వేసవిలోని బాటసారులకు సేద దీర్చి పుణ్యము కట్టుకొనిరి. ఆ చలిపందిటిలో ఉత్త మజ్జిగ మాత్రమే ఇయ్య కుండిరి.

          'లవణశుంఠీజం ఫలరసాను యుక్తముల్
           నీరు మజ్జిగకుండ బారులమర
           లఘులయైలాసూన లలిత సౌరభమిశ్ర
           శీతలజలకుంభ జాతమమర
           జీరకకైడర్య చారుగంధములొల్క
           పలుచనియంబళ్ళ పంట్లుదనర
           రవయుప్పు నీరుల్లి రసమునించిన కొళ్ళు
           గంజికాగులగుంపు కడురహింప
           గంధబర్హిష్ఠలామజ్జ కప్రశస్త కా
           యమాన ముహుర్ముహుర్జాయమాన
           మందపవమాన ఘనసార బృంద వేది
           కాలయవితాన పానీయశాలయొప్పె (2-160)