పుట:Andhraveerulupar025958mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుటకు బరితాపము కలుచున్నది. చిరకాలము వేమారెడ్డి బాహుదర్పమున మొక్కవోని పరాక్రమమున రాజ్యమును బరిపాలించి తన జ్యేష్ఠపుత్రుడును ధర్మవిదగ్రగణ్యుడునగు అనపోతారెడ్డికి రాజ్యభారమునర్పించి కీర్తికాంతను భూలోకమున శాశ్వతముగా నెలకొల్పి స్వర్గలోక మలంకరించెను.

________

హరిహరరాయలు - బుక్కరాయలు

ఆనెగొంది రాజధానిగా జేసికొని ఆంధ్రకర్ణాట దేశములను బాలించుచున్న జంబుకేశ్వరరాయలు డిల్లినుండివచ్చిన మహమ్మదీయ సైన్యముతో జిరకాలము పోరాడి వీరమరణమొందెను. రాజ్యాంగవిదుడగు మహమ్మదీయనృపుడు తన కెంతకును రాజ్యము స్వాధీనము గాకపోవుటచే బ్రజావిశ్వాసపాత్రుడగు హరియప్ప వడయరు అనుమంత్రిని రాజుగజేసి సుంకములు సకాలమున జెల్లించు కట్టుబాటులొనర్చి తన రాజ్యమునకు వెడలి పోయెను.

కాకతీయ సామ్రాజ్యము విచ్ఛిన్నమై ప్రతాపరుద్ర చక్రవర్తి బంధీకృతుడుగ డిల్లికి యవనులచే గొనిపోవ బడిన పిమ్మట మరల స్వతంత్రరాజ్యస్థాపనమున కవకాశములు కలుగకపోయెను. యవనులధాటి కాగజాలక ప్రజలు సుభిక్ష