పుట:Andhraveerulupar025903mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోనున్నది. ఆకథయందలి సత్యాసత్యముల జర్చింపక హృదయరంజకమగు నాకథ నిట వ్రాసెదము.

పరాక్రమశాలియు ధర్మమూర్తియు నగు దీపకర్ణిమహారాజు దక్షిణాపథమును బాలించుచుండెను. ఆతనికి రూపవతియు విద్యావతియునగు శక్తిమతియను భార్య కలదు. ఇరువురును మిగుల సౌఖ్యముగ గలసిమెలసియుండ వారి దాంపత్యము గాంచి దైవము కన్ను కుట్టెనేమోయన శక్తిమతి సర్పదష్టురాలై మరణించెను. దీపకర్ణి అనుకూలపత్నీ వియోగమునకు మిగుల దు:ఖించి యుత్తరక్రియు లన్నియు నిర్వహించి తనజీవితమునంతయు బ్రహ్మచర్యావస్థలోనే గడపుచుండెను. నాయనంతర మీమహారాజ్య మెవరిపాలుగానున్నదో, సంతానము లేదుగదా యను చింత దీపకర్ణిహృదయమును దహించు చుండెను. ఒకనాటి వేకువజామున సుఖనిద్రలోనుండ దీపకర్ణి కొక స్వప్నమువచ్చెను. కలలో నీశ్వరుడు కనిపించి నీవరణ్యములకు ఱేపు వేటకుబొమ్ము. నీకు సింహరాజముపై స్వారిచేయు నొకబాలుడు గనిపించును. వానిని గొనితెచ్చి పెంచి యీరాజ్యమును వానికి నిమ్మని చెప్పి యదృశ్యమయ్యెను.

తెల్లవారుగనే దీపకర్ణి పరిజనమును వెంటగొని వేటలాడుట కొక యరణ్యమునకుబోయి విహరించుచుండ మార్గమున బరుగెత్తుచున్న యొకసింహరాజము కనబడెను. దానిపై నమితతేజోరాశియు, సుందరాకారుడు నగు నొకబాలుడు