పుట:AndhraRachaitaluVol1.djvu/318

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్వృత్తాధ్వరకృత్య ఋత్విజ మహాతీర్ణాపగో నావికం

యుద్ధార్తం నుభటం చ సిద్ధవిజయో వోడార మాప్తస్థల:

వృద్ధం వార వధూజనంచ కితవో నిర్విష్ట తద్యౌవనో

ధ్వస్తాతంకచయ శ్చికిత్సక మపి ద్వేష్టి ప్రదేయార్థినం.

అనబృథస్నానంబు నాచరించిన సోమ

యాజికి ఋత్విజుడన్న నలుక

యేరంతయును దాటి తీరమ్ము జేరిన

పాంథునకు నరంగుపై జిరాకు

విజయమ్ము గైకొని నిజపురమ్మున కేగు

నవనీపతికి బంటునం దసూయ

యిష్ట దేశమ్మున కేగిన పిదప స్వా

మికి యాసవాహకుమీద వినుపు

యౌవన మ్మంతయును జూఱలాడినట్టి

కితవునకు వారసతి యెడ గేరడంబు

వ్యాధి కుదిరిన వానికి వైద్యుపట్ల

వెగటు తా మీయవలసిన విత్త మడుగ.

సంస్కృతమున క్షేమేంద్రుడు రచించిన ఔచిత్య విచారచర్చ, కవి కంఠాభరణము, నువృత్తతిలకము వీరు తెనుగుపఱిచిరి. ఇందిరాదేవి, సుభద్ర, శకుంతల, దమయంతి మున్నగునవలలు వీరివి చదువదగినవి. వీరి యుత్తర రామచరత్రాంధ్రీకరణము నాలు గంకములు మాత్రము వెలువడినవి. ఇవిగాక, యీజంటకవులు కవితా పత్త్రికా మూలమున నెన్నో ప్రాచీనార్వాచీనకృతులు వెలువరించిరి. వానిలో మత్స్యపురాణము, పరమయోగివిలాసము, మైరావణచరిత్ర, ఆధ్యాత్మ రామాయణము, చంపూ భారతము, భారతఫక్కి, ప్రబోధ చంద్రోదయము, పరాశరస్మృతి ముఖ్యగ్రంథములు.

                                                    38