పుట:AndhraRachaitaluVol1.djvu/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నుం బాండిత్య నిధాను లుండు సభయందుం బట్టి రెట్టించి గ

ర్వంబున్మాన్చి యనుగ్రహించునట! తద్వాత్సల్య మూహించితే?

తిరుపతిశాస్త్రిగారు వెలనాటివారు, వేంకటశాస్త్రిగా రారామద్రావిడులు నైనను నేకోదరులవలె మెలంగుచు బరస్పరసహకారముతో నవధానములు, ఆశుకవితలు, ఆకాశపురాణములు ప్రదర్శించుటచే వీరిపేరు త్వరలో బ్రశస్తికెక్కినది. అవధానకళకు గౌరవము తెచ్చినవారు, చులుకదనము కల్పించినవారును దిరుపతి వేంకటకవులే. వీరికిముందు మాడభూషి వేంకటాచార్యులు, అంతకుమిక్కిలి ముందు రామరాజభూషణుడు మున్నగువారు శతలేఖినీ గ్రంథసంధానచాతురికలవా రున్నను, వారెవ్వరును దిరుపతి వేంకటకవులవలె జంటకవులుగా నుండి యవధానములు చేసినవారు కారు. పిఠాపురసంస్థాన కవులయిన దేవులపల్లి సోదరులును, వేంకటరామకృష్ణులు, అత్యద్భుతావధాన కవితా ప్రదర్శనముల గావించియున్నను తిరుపతికవుల తీరున నవధానవిద్యను జగద్విఖ్యాతము చేసినవారు కారు. రాయలకాలమున నంది మల్లయ్య, ఘంట సింగయ యను జంటకవులు ప్రబంధరచనము చేసిరి. వారవధానము లొనరించి యుండిరో, లేదో చెప్పజాలము. "జగదాశ్చర్యకరావధానకవితాసంపత్తి" ఒక్క తిరుపతి వేంకటకవియుగళమునకే తక్కినది.

'గోణము కట్టుటాది' వేంకటశాస్త్రిగారికి గవితాభిలాష యుండెడిది. ప్రఖ్యాత శాస్త్రపండితులు చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారి యొద్ద నీ జంటకవుల వ్యాకరణాధ్యయనము. ఇరువురును మహామేధావులుగాన నచిరకాలములో నాభాష్య మధికరించిరి. దేవీభాగవతము నందు గురుస్తుతి యిట్లున్నది.

సీ. అఇఉణ్ మొదలుగాగ నాభాష్యపర్యంత

మే మహామహుడు మాకిచ్చె విద్య