పుట:AndhraRachaitaluVol1.djvu/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యట్టు ; లటులయ్యు మే మెక్కి నట్టిదోనె

వారలెక్కిన తొలిమెట్టె స్వర్గమునకు.

వివిధవిషయ నివిష్టమతియగు కవిగారి కరిజ్ఞానమున కీ "నవకుసుమాంజలి" యాదర్శము. ఇదిగాక, వేంకటరామయ్యగారు మాలతీమాధవము, ఉత్తరరామచరితము. రాజశేఖరుని విద్ధసాలభంజిక రసోత్తరముగా ననువదించిరి. విద్ధసాలభంజిక 1906 లో రచితమై చిలకమర్తి లక్ష్మీనరసింహము వెలువరించిన 'మనోరమ' పత్రికయందు బ్రకటింప బడినది. ఉత్తరరామచరిత్రాంధ్రీకృతి యసంపూర్ణము. వీరి రచనలు చాలవఱకు బరివర్తనములైనను, శయ్యలో స్వాతంత్ర్యము నిండుగా నుండుటచే రక్తిగట్టి శాశ్వతత్వము సంపాదించుకొన జాలియున్నవి. తెనిగింపులో నింతగా నింపు పుట్టించురచన యెందఱకో యలవడదు. ఈపొందిక కనుగొనుడు:

సీ. మఱుగ గాగిన పాలమఱపించు కరముల

గిలిగింతనెవడు పొంగించుజలధి

భువనత్రితయ దివ్యభవనంబునకెవండు

నవసుధారస లేపనంపుగుంచె

సిద్ధౌషధంబయి చెలగి యెవ్వనివెల్గు

మదనపల్లి నివుళ్ళు పొదలజేయు

జివురు విల్తుని కేళి భవనాంగణమునకు

జారుచందన పంతచర్చ యెవడు

గీ. అతడు వెలుగొందు గుంకుమన్యాసగౌర

మానినీరమ్య వదనోపమానమూర్తి

ఘటితచక్రవాక మిధున పటుతరార్తి

సాంద్రతరకీర్తి యామినీచక్రవర్తి.