పుట:AndhraRachaitaluVol1.djvu/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గిడుగు వేంకట రామమూర్తి పంతులు

1863 - 1940

వీరి పూర్వులు తూర్పుగోదావరి మండలములోని ఇందుపల్లికి జెందినవారు. వీరి తండ్రిగారికి విజయనగర సంస్థానములో నుద్యోగము లభింప నక్కడకు వచ్చిరి. తండ్రి: వీరరాజు. పంతులుగారి జన్మస్థానము: ఉత్తరవిశాఖ మండలములోని పర్వతాలపేట. నివాసము: పర్లాకిమిడి, రాజమహేంద్రవరము. జననము 12-8-1863. మరణము 22-1-1940. రచించిన గ్రంథములు: 1. వ్యాససంగ్రహము 2. వ్యాసావళి 3. బాలకవి శరణ్యము 4. ఆంధ్ర పండితభిషక్కుల భాషాభేషజము 5. గద్య చింతామణి, మరియు ననేక వ్యాసములు.

రామమూర్తిపంతులుగారిచేయి నాలుగుదశాబ్దులు వాజ్మయములో నలిగినది. ఆంధ్రసాహిత్యపరిషత్తున కారంభములో రామమూర్తిగారు సభ్యులు. క్రమముగ నవ్యసాహిత్యపరిషత్తునకు వీరు ప్రతిష్ఠాపకులైరి. పంతులుగారు వ్యావహారికభాషాసౌధనిర్మితికివిశ్వకర్మలు. వీరు పాశ్చాత్యవాజ్మయమునుదఱచి ప్రాచీనభాషాతత్త్వము గాలించి యాంధ్రసారస్వత రంగమున బ్రవేశించిరి. స్వయంకృషిచేత బి. యే. పరీక్షలో రాజధానికి రెండవవాడుగా గృతార్థుడైన మేధానిధి. సగము రక్తమాంసములు భాషావాజ్మయచరిత్ర పఠనపరిశోధనములకు, బురాతన వస్తు శాస్త్రపరిశీలనములకు వెచ్చించిన దీక్షితుడు. కళింగసామ్రాజ్యముంకు ముఖ్యపట్టనము ముఖలింగక్షేత్రమని బహుళాధారములు చూపి


సవరలకు లిపి వ్యాకరణములు పుట్టించి పుణ్యము

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)