పుట:AndhraRachaitaluVol1.djvu/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగ్గురు బాహుబట్టి భవదాయత బాహులు మేను సోకినన్

గగ్గరుపాటు సంభవముగా దెటులారట మొందు చుండినన్

ఈ రెండు ఘట్టములలో గవి వెలువఱించిన కవితా శయ్యా భేదములు సహృదయాస్వాద్యములు.

రాజమహేంద్రవరమున నాధునికాంధ్రకవిత్రయ మని పేరొందినవారిలో వీరొకరు. ఆంగ్లభాషావిశారదులగు మిత్రులతో నిరంతరము సంభాషించుచుండుటవలన వీరికవిత్వమునకు బాశ్చాత్యకవిత్వమునందలి నవీన భావములు కొన్ని యబ్బినవి. వీరి కవిత్వరచన కేవలము ప్రాచీనఫక్కినే నడచిన దని చెప్ప వీలుకాదు. క్రొత్తభావము లెన్నో వీరిపద్యములలో బరికింప వచ్చును. ఆశుకవిత యనిన సుబ్బారాయుడుగా రసహ్యపడువారు. కబ్బం బల్లుదుగాని యాశుకవనోగ్రవ్యాఘ్రదంష్ట్రాళికే నబ్బబ్బా! గుఱిగాను.......అనివీరు బాధపడినారు. ఆశుకవిత నందముగా జెప్పసమర్థులే యైనను దానియందు వారి కప్రీతి. ఇది కొందఱకు వింతగానుండును. పద్యము చెప్పి నాలుగైదుమాఱులు వెనుకముందు లాలోచించి సానబట్టినగాని వారెన్నడు ప్రకటింపలేదట. వ.సు.కవి తనప్రతిభా ప్రభ నాంధ్రమున బ్రసంచించి సహస్రమాసములు జీవించి చనిన మహాకవి. 1933 లో రాజమహేంద్రవరమున జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషన్మహాసభ కధ్యక్షతవహించి 38లో జీవయాత్ర చాలించిరి. వ.సు.చరిత్రము మధురగంభీరమైనది. వ.సు.కవి సంకల్పసిద్ధుడు.వార్థకమున నతడీ క్రిందివిధముగా దైవప్రార్థనము చేయువాడు.

కడచిననాళ్ళ బైబడిన కష్టములం దలపోయ నిప్డు నా

యొడలు గగుర్వడంకు జెమ రుప్పతిలున్ బెడగొండలట్టినా

యిడుమల నెట్టు నన్మనిచి యీస్థితి నిల్పితొ యంచు నబ్బురం

పడుదు, శుభాంతముంజలువుమా వనునాటకమున్ జగత్కనీ!

                     _________________