పుట:Ananthuni-chandamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్నిచోట్ల చాలావ్రాతప్రతులలో ఒక్కలాగుననే ఉన్నపాఠము అచ్చుపడ్డపుస్తకములలో కనబడకపోవుటచేతను, అచ్చుపడ్డపుస్తకములలో ఉన్న పాఠము నన్నయ వాగ్వ్యవహారమునకు విరుద్ధముగా ఉండడముచేతను పరిష్కర్తలు తెలుగులాక్షణికులమతము ననుసరించి నన్నయపాఠములను దిద్దినారని ఊహించవలసి ఉన్నది. చూడండి:-

(1) నీపరోక్షంబున రాజుగావలె + నెమ్మినిట్లీఁగ (ఆది. 1V. 175)

(2) ఏమేము మున్ను పూజింపుదుము రుద్రు + నిందని వేడ్క (ఆర. II. 255)

'కావలె' 'పూజిందుము' వంటి ప్రయోగములు మరియెచ్చటను నన్నయభారతముందు కనబడవు. ఇవి ఇటీవలి కవులు వాడినారు గాని పూర్వకవిప్రయోగములు కావు; గనుక 'కావలయు' 'పూజింతుము' అనే నన్నయ వాడి ఉండును. అయిదారు వ్రాతప్రతులలో ఇట్లే ఉన్నది. 'కావలయు', 'పూజింతుము' అని ఉన్నయెడల మీద చూపించిన 10 పాదములవలెనే ఈ రెండుపాదములలోను గణములతీరు లాక్షణికులు చెప్పినవిధమున ఉండదు, చూడండి:-

(1) నీపరోక్షంబున రాజుగావలయు + - నెమ్మినిట్లిఁగ (వ్రాతప్రతులు)

(2) ఏమేము మున్నుపూజింతుము రుద్రు + నిందని వేడ్క (వ్రాతప్రతులు)