పుట:Ammanudi April-July 2020.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రచన కమిటీ వైర్మన్‌గా అంబేద్మర్‌ నియమికులైనప్పటి నుంచి ఆయన ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల రాజ్యాంగాలను నునిశితంగా అధ్యయనం చేశారు. వాటి అవగాహన నేపథ్యంలో దేశంలోని అన్ని వర్దాల్కు కులాలు, ప్రాంతాలు, మతాలు, జాతులు, జెందర్‌ తదితర సామాజిక సమూహాలన్నిటి సమస్యల్ని వారి హక్కులు, ఆకాంక్షలు, అవసరాలన్నిటినీ ఆయన ఆకళింపు చేసుకున్నారు. ఈ క్రమంలో అంబేద్మర్‌ అద్భుతమైన రాజ్యాంగాన్నీ దేశప్రజలకు అందించడమే కాదు, “రాజ్యాంగ రచని అంబేద్మర్‌ దృక్పథాన్ని తీర్చిదిద్దింది. పాశ్చాత్య (వజాస్వామిక దార్భనికుల దృక్పథం పునాదిగా రూపుదిద్దుకున్న అంబేద్మర్‌ అవగాహనను, రాజ్యాంగ రచన భారతీయ మార్గం పట్టించింది. వివిధ తరంగ పరిమాణాలుగా (వేవ్‌ లెంగ్స్‌), ఏడు రంగులతో కూడిన తెల్లటి కాంతిలాగా వివిధ కులాల ఏక వ్యవస్థగా ఉన్న భారత ప్రజాసమూహాల విడివిడి సమస్యలను, వారి హక్కులు, ఆకాంక్షలను ప్రతిభీంపించింది. ఆ నేపథ్యంలో నడిచే రాజ్యం ద్వారా ప్రజలందరినీ చట్టం దృష్టిలో సమానంగాను, అణగారిన వర్గాలకు అందదందలను ఇచ్చే పాలనను ఎలా అందించాలనే కోణంలో సాగిన రాజ్యాంగ రచనా కృషితో అంబేద్మర్‌ ఆలోచనాక్రమం మరింత విస్త్రృతంగా సంఘటితమైంది. దీంతో తాలి అంబేద్మర్‌ ఆలోచనల స్థానంలో రాజ్యాంగ రచన అనంతరం ఆయన ఆలోచనల్లో గుణాత్మక పరిణామం సంభవించింది. మొత్తం భారతీయ సమాజం పడుతున్న బాధ నుంచి విశ్వమానవ విముక్తి దిశగా ఆయన అలోచనలు ప్రవహించాయి. దాంతో మలి అంబేద్మరిజం దళిత, బహుజన, (శామిక్క లింగ తదితర అణగారిన ప్రజల దృక్పథం పునాదిగా మొత్తం భారతీయ సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తుంది. అందుకు అధ్యాత్మిక విప్లవం తప్పక జరగాలని ఆయన ప్రగాఢంగా ఆశించారు. సామాజిక వైయక్తిక బాధల నుంచి మానవ విముక్తి మార్గం ఆయనకు బౌద్ధంలో దర్శనమిచ్చింది.

అంబేద్మర్‌ నుదీర్ణకాలంగా బౌడ్బ్దాన్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో; రాజ్యాంగ రచన (ప్రభావంతో ఆయన అణగారిన అప్తిత్వాల దృక్పథం పునాదిగా మానవ విముక్తి మార్గం వైపు అడుగులు వేశారు. అందులో భాగంగా 1850లలో ఆయన బౌద్ధాన్ని లోతుగా, సునిశితంగా అధ్యయనం చేయడంపై కేంద్రీకరించారు. 1950లో సిలోన్‌ లో 'వరల్డ్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ బుద్దిస్ట్స్‌” అనే సమావేశంలో క్రియాశీ లంగా పాల్గొన్నారు. ఆ తర్వాత పూణెలో బుద్ద విహారాన్ని నీర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే బుద్దిజంపై పుస్తకం రాస్తున్నానని ప్రకటించారు. 1954లో బౌద్ద సాంస్కృతిక అధ్యయనం కోసం ఆయన బర్మాను రెండుసార్లు పర్యటించారు. రెండవసారి మళ్ళీ 'వరల్డ్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ బుద్దిస్టు' సమావేశంలో పాల్గొన్నారు. 1955లో ఆయన భారతీయ బుద్ధ మహాసభను స్థాపించారు. 1956 అక్టోబర్‌ 14న 22 ప్రమాణాలతో ధర్మచక్ర పరివర్తన సమావేశం విజయవంతమైంది. ఆ తర్వాత ఆయన ఖాట్మండూలో జరిగిన నాల్బవ ప్రపంచ బౌద్దీయ మహాసభలో పాల్గొన్నారు. “బుద్దుడు, ఆయన ధర్మం? అనే పుస్తకం చిత్తు ప్రతినీ పూర్తి చేసిన అనంతరం మూదు రోజులకు 1956 డిసెంబర్‌ 6న ఆయన పరినిర్వాణం పొందారు.

రాజ్యాంగ రచనా ప్రక్రియ అంబేద్మరను సర్వమానవ విముక్తి దృక్పథాన్ని అలవర్చుకునేట్లు చేసింది. ఈ దృక్పథమే అంబేద్మర్‌ను

| తెలుగుజాతి పత్రిక అవ్వునుడి ఆ ఖజలై-2020 |

మానవ విముక్తికి హేతు మార్గాన్ని సూచించే బౌద్దం వైపు మళ్లేట్లు చేసింది. “ధర్మచత్ర ప్రవర్తన దినం” సమావేశంలోని 22 ప్రమాణాల్లో ఏ ఒక్క ప్రమాణం కూదా కుల అణిచివేత పునాదిగా శుద్ద అగ్రకుల వ్యతిరేకతను, ధిక్మారాన్ని సూచీంచేదిగా లేకపోవడం విశేషం. శుద్ద కుల దృక్పథం నుంచి కాకుందచా అణగారిన కులాలు, వర్ధాల దృక్పథం పునాదిపై వెొత్తం సామాజిక విముక్తి అవగాహానను ఆయన సంతరించుకున్నట్లు అర్ధమవుతుంది. హిందూ మత ఆధ్యాత్మీకత నుంచీ భారతీయ సమాజం బయటపడి బౌద్ధ దృక్పథాన్ని సంతరిం చుకోవలసిన అవసరాన్ని ఆ ప్రమాణాలు నొక్కి చెబుతున్నాయి. వర్గ పోరాటం, సామాజిక సమానత్వం అనే భావనలతో కూడిన నవయాన బౌద్ద దృక్పథమే విముక్తి మార్దంగా అంబేద్మర్‌ బోధించారు. అన్నీ రకాల అసమానతలను ధ్రువీకరించే హిందూ మత దృక్పథానికి ప్రత్యామ్నాయంగా అత్మ పునర్జన్మ, నీరాశావాద ఆర్యసత్వాలు తదితర అహేతుక భావనలు లేని అసలైన బుట్ట జోధనలను అధ్యయనం చేయాలని అంబేద్మర్‌ సూచించారు. సమగ్ర సామాజిక దృక్పథాన్ని మలి అంబేద్మరిజం సూచిస్తుంది. నేదు అంబేద్మర్‌వాదులుగా చలామణి అవుతున్నవారు స్వాతం(త్రోద్యమ కాలంనాటి తాలి అంబేద్మర్‌ దృక్పథానికే పరిమితమై, రాజ్యాంగరచన తర్వాత ఏంతో పరిణతి చెందిన మలి అంబేద్మర్‌ హేతుదృక్పథాన్ని నిర్ణక్ష్యం చేస్తున్నారు. శకల మతవాదమష్హైాన కులవాదాన్ని వట్టుకుని తమలోతాము పోట్లాడుకోవదం వల్ల ఆయా సామాజిక సమూవాోలకే కాక, మొత్తం సమాజానికి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఆయా కుల అస్తిత్వాల నుంచి రిజర్వేషన్లు, ప్రభుత్వ సహాయాలతో ఆర్థికంగా లప్దీ పొంది, సంప్రదాయ వృత్తుల నుంచి బయటపడి వివిధ ఉపాధి వ్యవహారాల్లో స్థిరపడిన అవశేష అస్తిత్వ (కుల, మత, ప్రాంత, జాతీ, లింగ తదితర) ప్రజానీకం నుంచి వచ్చిన నాయకులు ముఖ్యంగా ఇలాంటి సంకుచిత అస్తిత్వ వాదాలను ముందుకు తెస్తున్నారు. వాళ్ళు బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలన్న అంబేద్కర్‌ పిలుపును తల్లకిందులుగా మార్చి, పాలక వర్గాల అధికార యంత్రాంగంలో భాగస్వాములుగా, ఆయా పార్టీలకు తమ అస్తిత్వ ప్రజానీకపు వోటు బ్యాంకుల్ని సమకూర్చే “దండ నాయకులు”గా తయారయ్యారు. అణగారిన అస్తిత్వ ఉద్యమాలు అత్యంత సమర్శనీయవమ్హైనవి, అనివార్యమైనవీను. ఆపేరుతో పాలకవర్గ కూటమిలో స్థానం కోసం పాకులాదే అస్తిత్వవాద నాయకులు తమ నిజ అస్త్రిత్వాల (సంప్రదా యక వృత్తుల్లోని శామీక ప్రజలు) ప్రజానీకానికి తీవ ద్రోహం చేస్తున్నారు బహుజన హితాయ!

అంబేద్మర్‌ ప్రధానంగా పాశ్చాత్య హేతువాద తాత్త్విక పునాదిగా సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసారు, అవపోసన పట్టారు. దాంతో ఆయన వివిధ మతాలకు చెందిన దృక్పథాలను సైతం సామాజిక ప్రజాస్వామిక స్వభావాన్నీ కలిగి ఉన్నాయా లేదా అనే కోణం నుంచి మాత్రమే పరిశోధించారు. ఈ నేపథ్యంలో ఆయన బౌడ్దాన్నీ కూడా సామాజిక దృక్పథంతోనే అధ్యయనం చేసారు కానీ, దానీలోని అమేయమైన తాత్వికతను ఆకళింపు చేసుకోలేదు. “బుద్దుడు,

తరువాయి 40వ పుటలో...