పొందాయి.
హైకోర్టు తీర్పుపై తన అభిప్రాయం చెప్పవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థను అడిగింది. ఈ అభిప్రాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచి దానిపై కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాతే సముచిత నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
2017-18 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 67.4 మాత్రమే! ఇది జాతీయ సగటు కన్నా తక్కువే! అంటే దాదాపు ఇప్పటికీ సగం మంది నిరక్షరాన్యులే! ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవితవ్యానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు ఆ విషయంపై తల్లిదండ్రులను కూడా విద్యావంతులను చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయమైనా ప్రజాస్వామిక చర్చ తర్వాతే జరగడం ఆనవాయితీ! ఆ సత్సంప్రదాయాన్ని ప్రభుత్వం కొనసాగించాలి.
హైకోర్టు తీర్చును సానుకూల దృక్పథంతో అర్థం చేసుకొని ప్రభుత్వం భాషాపరంగా తన విధానాలను పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉంది.
ఈ వ్యాసరచయిత నందివెలుగు ముక్తేశ్వరరావుగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో- విభజనకు రెండురోజులు ముందు వరకు 2014మే - భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు. అంతకుముందు నల్గొండ జిల్లా కలెక్టర్గా (2011-13) పని చేసినప్పుడు జిల్లా అంతటా పాలనను తెలుగులోకి తేవడంలో మొత్తం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. డెప్యూటీ కలెక్టర్గా పనిచేసినప్పుడు, ఆ తర్వాతా కూడా పరిపాలనలో ప్రజలకు సన్నిహితంగా ఉండి, ప్రజల కలెక్టర్గా ప్రజల్లో పేరుగాంచిన వ్యక్తి. తిరుముల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వాహణాధికారి (జె. ఇ.ఒ.)గా తీర్మానాలను తెలుగులో వ్రాయించే సంప్రదాయాన్ని నెలకొల్పారు. మహాభారతం 18 పర్వాలనూ తెలుగులో సాధికార ప్రచురణ గావించారు (2005-2006) జీవితంలో తొలి నుండి ఎంతో కృషి చేసి సాధారణస్థాయి నుండి ఎదిగిన ముక్తేశ్వరరావుగారు విశ్లేషణాత్మకంగా ప్రసంగించడంలోనూ, వ్యాసరచనలోనూ తనదైన శైలిని కలిగివున్నారు. ఉద్యోగ నిర్వహణలోనేగాక, వ్యక్తిగతజీవితంలో కూడా ఆదర్శంగా నిలిచారు.
- సంపాదకుడు
తెలుగును బోధించడం కాదు; తెలుగులొనే అన్నీ బోధించాలి
సంస్కృతిపై అధికారం ప్రజలదే, పాలకులది కాదు
ప్రజాస్వామ్యం కూడా ఇంత విధ్వంసం చేస్తుందా !
జన సంస్కృతిని జనుల ఓట్లే పాతేస్తాయా !
ఒక ప్రజాప్రభుత్వం జనభాషను జీవచ్చనం చేసింది.
మరొక ప్రభంజన ప్రభుత్వం జీవం పోస్తుందనుకుంటే,
సజీవ దహనం సంకల్పిస్తున్నది.
పరభాష పట్టెడు మెతుకులు పెడుతుందనుకున్నాా
అమ్మ పొట్ట కొట్టి నోటికి తాళం వేస్తుందా !
దేశ దాస్యం కన్నా
భాషాదాస్యం ఇంకా కడుపు కోత కదా !
ఓటు, పాలించే హక్ళునే ఇచ్చిందా
తరతరాల జన సంస్కృతిని
నాశనం చేసే హక్కునుగూడ కట్టబెట్టిందా !
మన ఓటుతో మన కంటినే పొడుచుకుంటామా?
తట్టలు మోసేవాడె బాలకార్మికుడా? -
అయోనుయ పరభాషను
లేలేత తలపై మోసేవాడు పసి కార్మికుడు కాడా !-
ఓటంటే వేసిన వాడి ఇష్టంమాత్రమే కాదు.
వారి ఓటువెనుక తరతరాలున్నాయి.
వాటికీ లెక్కకు తేలనంత విలువుంది.
ఏ ప్రలోభాలకో ఓటు వేసినవారి పొరబాటు
తరతరాల చరిత్రను చించి పోగులు పెడుతుందా !
గెలిచిన ఓట్లు మాత్రమే ప్రజలు కాదు.
గెలువని ఓట్లు, ఇంకా బయటకు రాని ఓట్లు,
భయంతో దాగిన ఓట్లు,
ఇంకా పలకా బలపం పట్టని ఓట్టు
మరణించిన గొంతుల ఓట్టు,
అన్నీవినగలిగిన వాడే జాతి ద్రష్ట
అది వినలేని చెవిటివాడు జాతి భ్రష్ట
ఓట్ల సంఖ్యాకనచం తొడుక్కున్న పిండారీ దోపిడిదారు.
వ్రాసిన రాజ్యాంగం మాత్రమే కాదు,
వ్రాయని రాజ్యాంగం ఇంకా ఎంతో వుంది.
శాసనసభకు రాలీని జనంతరంగం
దాన్ని తీర్మానిస్తుంది
వ్రాయని భవిష్యత్తును వెలికి తీస్తుంది.
- డా వావిలాల సుబ్బారావు
- 9866402973
PPrh|తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జులై-2020 ||13}}