చేస్తే వారు సరైన పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది.
ఈ విషయంపై (పిల్) ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన గుంటుపల్లి శ్రీనివాస్ గారు తీర్చు వచ్చిన అనంతరం ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.
" ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎవరూ దూరం చేయలేదు. తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు రెండూ ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతరంగా ఉన్నాయి.
కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదవాలి అని పిల్లలను నిర్బంధించడం మంచిది కాదు. దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం!
వెనుకబడిన పిల్లలు అవకాశాలు అందిపుచ్చుకో లేకపోవడానికి కారణాలు రెండు: 1. ప్రీస్మూల్ ఎడ్యుకేషన్ లేకపోవడం 2. మౌలిక వసతుల, మానవ వనరులలోపం.
ఇటువంటి మౌలిక సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం మాధ్యమం వల్ల వెనుకబడుకున్నారు అని చెప్పడం సబబు కాదు.
ఉపాధ్యాయుల పాత్ర
విద్యారంగానికి సంబంధించి అత్యంత కీలకమైన ఈ విషయంపై బయట సమాజంలో చర్చోప చర్చలు జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయ వర్గం స్పందించాల్సిన అంతగా స్పందించకపోవడం బాధాకరం.
ఉపాధ్యాయ సంఘాలు, భాషా పండితులు మాతృభాషలో బొధన ఆవశ్యకత గురించి సమాజాన్ని తల్లిదండ్రులను చైతన్య పరచాల్సిన అవసరం ఉంది.
హైకోర్టు తీర్చు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21వ తారీఖున జీవో 20 విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులు మొదలైన వారి సహాయంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ఏ మాధ్యమంలో చదివించాలి అనుకుంటున్నారో వివరాలు సేకరించండి అన్నది ఈ జీవో సారాంశం. దీనికోసం ఒక నమూనా పత్రం కూడా తయారు చేశారు.
దరఖాస్తు రూవకల్పనలోనే అనవగాహన స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి విషయాలలో అభిప్రాయ సేకరణకు రూపొందించే నమూనా కేవలం అవును/ కాదు అనే పద్దతిలో కాకుండా వివరణాత్మకంగా ఉండాలి.
మీ పిల్లలు ఏ మీడియంలో చదవాలని అనుకుంటున్నారు అని అభిప్రాయ సేకరణ కోసం తల్లిదండ్రులకు ఇవ్వజూపిన నమూనాలో పూర్తి తెలుగు మీడియం అని ఒక మాట వాడారు. దీని స్థానంలో ఇంగ్లీష్ క్షుణ్ణంగా నేర్పించే ఆంగ్ల ఉపాధ్యాయులు ఉన్న తెలుగు మీడియం అని మార్పు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపిస్తే ఆటు మాతృభాషకు, ఇటు ఆధునిక అవసరాలకు కూడా ఉపయోగపడే పని చేపినట్లవుతుందని నేను భావిస్తున్నాను
ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఆసుపత్రులలో ఒక క్లిష్టమైన ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వైద్యుడు ముందుగా రోగి బంధువులను పిలిపించి పరిన్టితిని వివరించి, కష్ట నష్టాలు , సాధ్యాసాధ్యాలు చెప్పి అప్పుడు మాత్రమే సంతకము లేదా వేలిముద్ర తీసుకొని ఆపరేషన్ చేయడానికి సిద్దపడతాడు.
ఇక్కడ కూడా ఈ మాధ్యమంలో చదివితే ఎటువంటి ఫలితాలు వస్తాయి, విద్యార్ధి స్థాయి ఏమిటి, బోధన మాధ్యమం గురించి మేధావులు అనాదిగా ఏమి చెబుతూ వన్తున్నారు మొదలైన విషయాలను కూలంకషంగా వివరించి ఆ తర్వాత మాత్రమే సంతకాల సేకరణకు సిద్దపడాలి.
నిర్ణయాన్ని తల్లిదండ్రుల చేతిలో పెట్టినట్లే పెట్టి వారిచేతనే అవును అనిపించేలా చేయడం దీని వెనుక ఉన్న కుట్ర. చాలామందికి మూడు ముక్కల ఆట ఆడే విధానం జ్ఞాపకం ఉండే ఉంటుంది. దాంట్లో ఆడేవాడు మూడు ముక్కలను బోర్లించి ఏది ఎక్కడ ఉందో చెప్పమని ఎదుటివాడిని అడుగుతాడు. కానీ ఎదుటివాడు గెలుస్తాడు అన్న హోమీ ఏమీ లేదు. పైగా చాలాసార్లు ఓడిపోయే అవకాశమే ఉంది. ఇదో కనికట్టు లాంటిది. విద్యార్థి భవితవ్యాన్ని నిర్ణయించే ఇటువంటి కీలక విషయాలలో కుయుక్తులు పన్నడ ఎంతవరకు సమంజసం?
తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటు కచ్చితంగా ఒక ప్రజాస్వామిక చర్య. కానీ ఆ కమిటీ ఏ ఏ విషయాలలో జోక్యం చేసుకోవాలి? ఏ ఏ అధికారాలు దానికి కట్టబెట్టాలి అనే దాంట్లో విచక్షణ ఉండాలి. పాఠశాల మౌలిక సదుపాయాలు, పాఠశాలలో కొన్ని కార్యక్రమాల నిర్వహణ వంటి విషయాలలో తల్లిదండ్రుల ప్రవేయం అభిలషణీయం.
బోధన ఏ మాధ్యమంలో జరిగితే బాగుంటుంది అనే విషయం బొధన రంగంలో విశేష అనుభవం ఉన్న మేధావుల సూచనలకు అనుగుణంగా ఉంటే బాగుంటుంది.
ఇక్కడ అటువంటి ప్రయత్నం ఏదీ కనిపించడం లేదు. పైగా దీన్ని తూతూమంత్రంగా రెండు మూడు రోజులలో పూర్తి చేయడానికి సిద్ధపడ్డారు.
తాను తీసుకున్న నిర్ణయాన్ని ఏదో రకంగా అమలు చేయాలి అనే పట్టుదల కన్నా నలుగురూ ఏం చెబుతున్నారు అనేది పట్టించుకుని నిర్ణయం తీసుకుంటే జూతికి మేలు జరుగుతుంది.
ఇంగ్లీష్ నేర్చుకోవడానికీ ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం ఒక్కటే మార్గము అనుకోవడం అశాస్త్రీయమైన భావన. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా భాషావేత్తలు, విద్యావేత్తలు, తత్వవేత్తలు ఎవరూ దీన్ని అంగీకరించలేదు.
ఆధునిక ప్రపంచంలో అందరూ ఆంగ్లం నేర్చుకోవాల్సిందే! సమాజంలో మరింత సముచిత స్థానాన్ని పొందడానికి, అవకాశాలు పెంపొందింప చేసుకోవడానికి, స్పర్థామయ ప్రపంచంలో మనం తట్టుకోవడానికి ఇంగ్లీష్ కావాలి అనడంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికీ ఇంగ్లీష్ భాషని క్షుణ్ణంగా శాస్త్రీయంగా బోధించే ఉపాధ్యాయులు కావాలి. వీరిని అందిస్తామనే హామీనీ ప్రభుత్వం ఇవ్వాలి.
దీనికోసం ఆంగ్లభాషను శాస్త్రీయంగా బోధించే ఇఫ్లూ, ఆర్ ఐ ఈ లాంటి సంస్థల సహాయాన్ని తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్గా పని చేసినప్పుడు ఆంగ్ల భాష విషయంలో క్షేత్రస్థాయిలో నేను చేసిన ప్రయోగాలు స్మరణీయాలు. అక్కడ రెండు రకాలుగా ఆంగ్ల భాష ప్రవేశపెట్టబడింది. 1 డిస్మోర్స్ మెథడ్ 2 పద సంపదను అభివృద్ధి చేసే విధానం. రెండు పద్ధతులు సంపూర్ణంగా విజయవంతం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు