పుట:Ammanudi-June-2019.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదక హృదయం


సంపుటి: 5

సంచిక: 4

అమ్మనుడి

జూన్‌ 2019

జాతి మనుగడకే సవాలుగా మారిన ప్రభుత్వాల భాషావిధానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీని ఓడించి, వైఎస్‌ఆర్‌ సి.పి. అధికారంలోకొచ్చింది. తమ ఎన్నికల వాగ్దాన పత్రాల్లోనే ఈ పార్టీలు రెండూ, ఇకపై బోధనా భాషగా తెలుగు ఉండబోదని, ప్రాధమిక స్థాయినుండీ బోధనాభాషగా ఇంగ్లీష్‌ ఉంటుందని తెలియజేశాయి. చంద్రబాబుగారి ప్రభుత్వం ఈ విషయంలో కొంత దోబూచులాట ధోరణి వహించినా వైఎస్‌ఆర్‌ పార్టీ మాత్రం బోధనా భాషగా ప్రాధమిక స్థాయి నుండీ ఇంగ్లీషే ఉంటుందని స్పష్టమైన ప్రకటన చేసింది. తెలుగును ఒక భాషగా మాత్రం తప్పనిసరి చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ అంశాన్ని కూడా తమ ఎన్నికల ప్రచారంలో ఒక అంశంగా చేసి వైఎస్‌ఆర్‌ పార్టీ వ్యూహాత్మక ప్రచారం చేసింది కూడా.

భాషోద్యమకారుల పట్టుదల వల్ల 1 నుండి 10వ తరగతి వరకూ తెలుగును ఒక భాషగా /సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తూ 2003లో జి.ఒ.నెం:86/2.7. 2003 వచ్చింది. 1నుంచి 5 తరగతుల వరకు మాతృభాషలో విద్యాబొధనను తప్పనిసరి చెయ్యాలన్న డిమాండును త్రోసిపుచ్చి, అందుకు బదులుగా ఒక సబ్జెక్టుగా మాత్రం 10వ తరగతి వరకూ తప్పనిసరి చెయ్యడానికి ఒప్పుకొని ఆ ఉత్తర్వును జారీ చేసింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. వారి హయంలోనూ, తర్వాతి కాలంలో ఇప్పటివరకూ ఆ జి.ఒ. సరిగ్గా ఎన్నడూ అమలు కాలేదన్నది బహిరంగ రహస్యం. జి.ఒ లోనే ఉన్న కొన్ని లోటుపాట్లు కూడా అందుకు తోడ్పడ్డాయి. పాలకుల్లో రాజకీయ సంకల్పం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. క్రమంగా ప్రభుత్వ విద్యావ్యవస్థ బలహీనపడుతూ, ప్రయివేటు బోధనా సంస్థలు అన్ని స్థాయిల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి, అదంతా ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా మారిపోయింది. ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ఉండడమే కారణమని, వాటిని కూడా ఇంగ్లీషులోకి మార్చడమే దీనికి సరైన పరిష్కారం అనే ప్రచారం సాగింది. ప్రజలపై ఇది తీవ్రంగా ప్రభావం చూపింది. ఇంగ్లీష్‌ మీడియంలో చదివితేనే అది చదువనిపించుకొంటుందనీ, తెలుగు మాధ్యమం వట్టి దండుగ వ్యవవారమనీ తల్లిదండ్రుల్లో అభిప్రాయం బలపడ్డది. మన సమాజంలో వ్రేళ్లూనుకుపోయిన అన్ని రకాల వెనుకబాటుతనానికి ఇంగ్లీషు మాధ్యమంలో బొధనే పరిష్మారమనీ, ఆర్థికంగా ఎదగడానికి ఇదే సరైనదారి అనే నమ్మకం పాదుకుంది.

2003 సంవత్సరం నుండి నేటి వరకూ భాషోద్యమంలో ఇది ప్రధానాంశం అయినా, పరిస్థితి మరింత కఠినం అయిందే తప్ప, ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితిలో మార్చు రాలేదు. 2006లో రాజశేఖరరెడ్దిగారి ప్రభుత్వం 6వ తరగతి నుండి 10 వరకు మునిసిపల్‌ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో చం(ద్రబాబుగారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విద్యా వ్యాపారవేత్త నారాయణగారు అన్ని పురపాలక పాఠశాలల్లోనూ తెలుగు మాధ్యమాన్ని సమాధి చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్చడుతూనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుగారు ఇంగ్రీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. 2017 లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి, తర్వాత కొద్ది నెలల్లో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

5