పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదయవ అధ్యాయము

233



లందరిని న్యాయాధిపతి పిలిపించి విచారణ చేసి తీరవలెను. ముద్దాయికి ప్రతి అభియోగములోను ప్లీడరును పెట్టుకొనుటకు హక్కు గలదు. ప్లీడరును పెట్టుకొని లేనిచో న్యాయాధిపతియే ఆతని పక్షమున నొక ప్లీడరును నియమించును. విచారణయేప్పుడును బహిరంగముగ జరుగవలసినదిగాని రహస్యముగ చేయకూడదు. ఏముద్దాయియైనను ఒకే నేరముక్క ఒకసారికన్న ఎక్కువ పర్యాయములు శిక్ష అనుభ వించకూడదు.


ఏయభియోగములోను ముద్దాయిశక్తికి మించిన జామిను కోరగూడదు. అతి ఎక్కువ జుల్మానాలను, కూరమైన శిక్షలును విధించకూడదు. సరియైనట్టియు, బహిరంగ మైన ట్టియు, న్యాయశాస్త్ర సమ్మత మైనట్టియు విచారణజరిగి న్యాయాధిపతివలన తీర్పు లేకుండ ఏమనుష్యునియొక్క ఆస్తికిని, స్వేచ్ఛకును, ప్రాణమునకును , భంగముకలుగకూడదు,


ప్రభుత్వమువారు ఏపౌరునికి ఆస్తి తీసికున్నను దానికి సరియైన ఖరీదు ఆపౌరునికిచ్చి తీరవలెను. ఈ విధముగా పౌరుల యొక్క స్వేచ్చను కాపొడు నిబంధనలు సంయుక్త రాష్ట్రముల యొక్క రాజ్యాంగ విధానములో చేర్చబడినవి. ఇందువలన ఏపొరుడైనను జై లలో పెట్టక మునుపు ఒక న్యాయస్థానములో న్యాయశాస్త్ర ప్రకారము బహిరంగమైన జూరీతో కూడినవిచారణబడిన నేరస్తుడని శిక్ష విధింపబడవలెను. అంతేశాని 'అధ్యక్షుడుగాని కార్యనిర్వాహకవర్గమునకు చెందినవ యుద్యోగస్తుడుగాని పౌరులను నేరము చేసినట్లు అనుమానము మీద