పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii


ఎవరు లేరనియు "స్పెయిను దేశస్తులకంటే వీరు ఎక్కువ పనికి మొండి వేయువారనియు మెటిరన్ అను చరిత్రకారుడు , వ్రాసి యున్నాడు. అటువంటి వారు మత స్వాతంత్ర్యముకొరకు అమెరికా దేశమున కేగి అక్కడవలసలను స్థాపించి ఆవలసల యందుకూడ తల్లిదశ పుష్ప్రజలును, ప్రభువులును పెట్టు ధల కోర్వజాలక చివరకు బ్రిటీషు వస్తు బహిష్కార మాచరించి బ్రిటీషు పన్నుల నియ్యమని నిరాకరించి, ఇంగ్లండు వారితో యుద్ధము చేసి, స్వరాజ్యమును స్థాపించుకొనినారు. అమెరికనులన్న ఒక్క జతివారు కారు. 16 భాషలు మాట్లాడువాడును అంతకంటే ఎక్కువజాతులవారును అమేరికా సంయుక్త రాష్ట్రమందు నివసించుచున్నారు. వీరు 1778 లో స్వాతంత్ర్యము సంపాదించిరి. 18వ శతాబ్దాంత ముందు ప్రాస్సువారుకూడా రాజును చంపి వేసి అమెరికా వారు స్వాతంత్ర్యమును స్థాపించుకొనిన ఇరువది సంవత్సరములకు తమ దేశ మందు ప్రజాస్వామ్యమును నెలకొల్పుకొనగలిగినారు, కాని 18వ శతాబ్దపు భావములున్నూ అదర్శములన్నూ "స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము" అను భావముల నాశ్రయించి మాత్రమే నిర్ణయింపబడి యుండెను. ఇవన్నియు వ్యక్తి నత్త్వములుగాని, వ్యక్తులను సమ్మేళనము చేయు ధర్మములు కావు. సౌభ్రాతృత్వమున్న భావములో కూడ సమ్మేళనభావముకంటే సమానభావమే ఆకాలపు చరిత్రము నడిపినదైయుండెను. 19వ శతాబ్దమునందు అయిరోపాలోని భావములు మార్పు జెందినవి. బ్రిటీషు వారితో యుద్ధము సల్పకయే కనడా దేశస్థులు 1861 సంవత్సరములో తమ జాతి