పుట:Aliya Rama Rayalu.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లువేంకటాద్రియు వానిసైన్యములును శత్రురాజ్యమున బ్రవేశించి జయములుగొనుచు దండయాత్రను ముగింపకవెంటాడించి విడిచిపెట్టక యిబ్రహీమ్‌ఆదిల్‌షా శరణాగతుడై వచ్చి సంధిచేసికొనువఱకును వేంకటాద్రిదీక్షతో బోరాడుచునే యుండెను. బలవంతుడగు ఇబ్రహీమ్‌ఏదిల్‌షా కడసారి భీమరధీనది ప్రాంతమున వేంకటాద్రిసైన్యమునెదిరించి భయంకరమైన సమరము సలిపియు గెలుపుగొన లేకపోయెను. ఇచట వేంకటాద్రికి బరిపూర్ణవిజయములభించె ననిభట్టుమూర్తి తననరసభూపాలీయ మనుగ్రంథమున నీక్రింది రెండుపద్యములలో విస్పష్టముగా వర్ణించి యున్నాడు.

      "మ. బలధుర్యుండగువేంకటేంద్రునిమహాబాహాబలాటోపవి
           హ్వలుడై మున్నతిధావనక్రియసపాదాభిఖ్యుడై నట్టియే
           దులఖానుం డిదేనేడు గ్రమ్మఱసపాదుం డయ్యెనానర్మిలిన్
           దలదత్పాదము దాల్చె భీమరథిపొంత న్గాన నిత్యోన్నతిన్."

      "మ. స్థిర సంగ్రామజయాభిరాముడగునా శ్రీవేంకటక్ష్మావరుం
           డరయ వ్రాజశిఖావతంసు డగు దధ్యంబు గాకున్న నీ
           ధరణీపాలకు లెల్లమెచ్చగ సపాదక్షోని భృత్ర్పాప్తి భా
           సురదుర్గాధిపతిత్వవైభవభవస్ఫూర్తి న్విజృంభించునే."

ఇట్లు వేంకటాద్రితోనైన యుద్ధములయందు బరాజయము నొంది విహ్వలుడై పోయి విజాపురసుల్తాను శరణాగ