"ఆ. అసదృశోరుశౌర్యు డాహవగాండీవి
వేంకటాద్రి రాజవిబుధరాజు
అనిబరీదుగెలిచియాతనిబిరుదుమే
ళమ్ముగొనియెభూజనమ్మువొగడ."
ఇట్లుబీదరుసుల్తా నగుఅమీరుబరీదుషా విజితుడై శరణాగతుడై వశ్యు డయినవెనుక విజాపురసుల్తాను స్వసైన్య యుతముగ బలాయను డయ్యెను. ఇట్లుపలాయనుడై ఇబ్రహీమ్ఏదిల్షా పఱువిడుచున్నను వేంకటాద్రి వానిని విడిచి పెట్టక యాతనిసైన్యముల వెన్నంటి కూడ బోయెను. అట్లు పఱువిడిపోయి విజాపురసుల్తాను తుంగభద్రానదికి నుత్తరభాగమున రాచూరుదుర్గమునకు నైౠతిమూలను ముదిగల్లుదుర్గమునకు నాగ్నేయమూలను రెండుదుర్గములకునడుమ నున్న మానువదుర్గముకడ సుస్థిరముగా నిలిచి తనసైన్యముల మోహరింప జేసికొని మరలనెదుర్కొని యుద్ధము చేసెను. ఇచట వీనిని వేంకటాద్రి పెదతండ్రియగు నౌకుతిమ్మరాజు జయించి విజయముగొన్నవా డనికోనేరునాథకవి విరచితములయిన ద్విపదబాలభాగవతము, పద్యబాలభాగవతములలోని యీక్రింది వాక్యములనుబట్టి మనము తెలిసికొనగలుగుచున్నాము.
"కడిమిమైమానువకడరణక్షోణి
గడుసరినేదులఖానుజయించె." ద్వి. బా.
"మానువకడ నవాబూనిపోరను బరా
జయము నొందించె నేశౌర్యశాలి." ప. బా.