పుట:AarogyaBhaskaramu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
x
మ|| కననయ్యెంగద మీ మనోద్రడిమయు౯ . కన్పట్టె వాక్సిద్ధియు౯.

కనఁగానయ్యె భవత్ప్రభావబలము౯ సౌఖ్యప్రదుండైన సూ

ర్యుని నిండారుమనంబునం గొలువ నారోగ్యంబు చేకూరె. కా

వున మీమార్గముఁ బట్టువారి కిలలోఁ బొల్పారు సౌఖ్యోన్నతుల్.

రామసుబ్బారాయుఁడు.
ఇవి ముఖ్యమైనమిత్రలేఖలు. వీనితోడనే పీఠిక సమాప్తి.



----------



విజ్ఞాపనము.


ఈయారోగ్యభాస్కరమున నశ్లీల (అర్థవిషయకగ్రామ్య)దోషమున్నదని నే నెఱుంగుదును. కాని యనేకౌషధములు సేవించియు నారోగ్యము పడయఁజాలక తుదకు మొదలిడిన స్తుతియగుట నుద్రేకముతో నున్న బాధయంతయు విన్నవించుకొనఁబడినది. ఒరులు విన్న నపహిసింతురని యున్నవిధముఁజెప్పుకొనక యూరకున్న వైద్యునకుఁ దెలియుటెట్లు? వలయు చికిత్సఁజేయుటెట్లు? ఏ వైద్యులును గుదుర్సలేని పదబాధను బదపడి భాస్కరుఁడే ప్రశమింపఁజేసెఁ గావున నాపాలిటి కాయనయే వైద్యరాజు. అట్తిగాని కఖిలమును దాఁచక మొఱపెట్టుకొంటిని. తథ్య మెఱిఁగించుపట్ల ధర్మశాస్త్రములును నిఘంటువులుంబోతె నేను నీపథముఁద్రొక్కితి. సత్కవులు క్షమింతురుగాక.

విధేయుఁడు, జానపాటి పట్టాభిరామశాస్త్రి.