పుట:Aandhrakavula-charitramu.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

470

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

నెప్పు డెప్పుడు రచించెనో, ఆతని యంత్యదినము లెట్లు చెల్లినవో సాధ్య మైనంతవఱకుఁ జెప్ప బ్రయత్నించెదను.

శ్రీనాథుడు పాకనాటిసీమవాఁడయినట్టు భీమఖండమును కృతి నందిన బెండపూడి యన్నయమంత్రి చెప్పినట్లున్న యీ క్రింది సీసమువలనఁ దెలియవచ్చుచున్నది.

            "సీ. వినిపించినాఁడవు వేమభూపాలున
                           కఖిలపురాణవిద్యాగమములు
                కల్పించినాఁడవు గాఢపాకంబైన
                           హర్షనైషధకావ్య మాంధ్రభాష
                భాషించినాఁడవు బహుదేశబుధులతో
                           విద్యా పరీక్షణవేళలందు

                పాకనాఁటింటివాఁడవు బాంధవుఁడవు
                కమలనాభుని మనుమఁడ వమలమతివి
                నాకుఁ గృపసేయు మొక ప్రబంధంబు నీవు
                కలితగుణగణ్య ! శ్రీనాధకవివరేణ్య!

ఇప్పడు పాకనాటిసీమ యేదని విమర్శింపవలసి యున్నది. భారతారణ్య పర్వశేషాంతమునం దెఱ్ఱాప్రెగడ తన వాసస్థానమగు కందుకూరి తాలూకా లోని గుడ్లూరును కూడ పాఁకనాఁటిసిమలోని దానినిగా నీ క్రింది పద్యములలోఁ జెప్పి యున్నాఁడు:-

           "సీ. భవ్యచరిత్రుఁ డాప స్తంభసూత్రుండు
                             శ్రీవత్సగోత్రుండు శివపదాబ్ద
                సంతతధ్యానసంసక్తచిత్తుcడు సూర
                              నార్యునకును బోతమాంబికకును
                నందనల డిల బాఁకనాటిలో నీలకం
                              ఠేశ్వరస్థాన మై యెసక మెసఁగు
                గుడ్లూరు నెలవుగ గుణగరిష్ఠత నొప్పు
                              ధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ