పుట:Aandhrakavula-charitramu.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

406

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

అను వాసిష్ఠరామాయణమునందలి పద్యము వలనను, కవి స్వాతిశయభావము కలవాఁడని తోఁచుచున్నది. కవిశైలి తెలియఁబఱచుట కయి కొన్ని పద్యములను వ్రాసియీతని చరిత్రను ముగించుచున్నాను.

1. పద్మపురాణము:-

          ఉ. వేణివిలోలనీలజలవేణి విశాలపవిత్రసైకత
              శ్రోణి మరాళచక్రకులసుస్వరవాణి సరోరుహోల్లస
              త్పాణి సభక్తి మజ్జనవిధా, విశారదనాకలోకని
              శ్రేణి మహాఘశాత్రవవిశిక్షణ శాతకృపాణి యెల్లెడన్.

          ఉ. ఆ తరుణీలలామకుఁ బ్రియoబుగవే చని కాంచెనా జగ
              త్పూతము నక్షయార్తి పరి.. తివిధానసమర్థసత్పల
              వ్రాతము నవ్యపుష్పమకరందవిలోలుపమత్తషట్పదో
              పేతము దత్తనిర్ణరసమీహిత జాతముఁ బారిజాతమున్

2. వాసిష్ఠరామాయణము

          శా. ఆ రాజన్యు లుదగ్రు లుగ్రగతి నన్యోన్యప్రహారార్ధులై
              వీరానీకము పిచ్చలింపఁగ భుజావీర్యం బవార్యంబుగాc
              గ్రూరాస్త్రంబుల నొండొరుం బొదివి దిక్కుల్ వ్రయ్యఁబెల్లార్చుచు
              న్బోరాడంగ విదూరుc డీలె నపుడా భూమీశుచే భూవరా !

          చ. విను మునినాధ! తొల్లి పదివేవురు విష్ణుల లక్ష రుద్రులన్
              వనజభవాష్టకోటుల నవారణ మ్రింగినవాఁడ నాకు నీ
              యనిమిషనాయకుల్ త్చ....... వారలనెన్ననేల? పెం
              పున మిముబోటి విప్రు లొ..భోజనమాత్రమె నాకుఁ జూడఁగన్