పుట:Aandhrakavula-charitramu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

121

తి క్క న సో మ యా జి

     క. అసదృశముగ నరివీరుఁడు
        మసి పోవఁగ విఱిగి వచ్చె మగవంద క్రియన్
        గసవన్ మేయఁగ బోయిన
        పసుల న్వెలిఁ ద్రొబ్బి తిక్కపాలుఁడు దిరుగన్. *

    చ. పదటున వాజి రాహుతులపై దుమికింపుచుఁ దిక్కఁ డార్చినన్
        బెదరి పరిభ్రమించి కడుఁ బిమ్మట వీరులు భీతచిత్తులై
        యదె యిదె డాలు వాల్మెఱుఁగు లల్లదె యల్లదె యాతఁ డంచనన్
        గొదుకక యాజిఁజేసె రిపుకోటుల కందఱ కన్నిరూపులై.

    ఉ. చిక్కక మన్మసిద్దివిభుచే మును గొన్న ఋణంబుఁ దీర్చి మా
        తిక్కనమంత్రి సోమశిల దేవర సాక్షిగఁ లెన్న సాక్షిగా
        నెక్కిన వాజి సాక్షిగ మహిన్నుతి కెక్కిన కీర్తి సాక్షిగా
        స్రుక్కక మాఱుకొన్న రణశూరులు సాక్షిగఁ గొండ సాక్షిగన్

    సీ. దైర్యంబు నీ మేనఁ దగిలి యుండుటఁజేసి
               చలియించి మందరాచలము తిరిగె
        గాంభీర్య మెల్ల నీకడన యుండుటఁజేసి
               కాకుస్థ్సుచే వార్థి కట్టువడియె
        జయలక్ష్మి నీయురస్థలినె యుండుటఁజేసి
               హరి పోయి బలి దాన మడుగుకొనియె
        నాకార మెల్ల నీయందె యుండుటఁజేసి
               మరుఁడు చిచ్చునఁ బడి మడిసి చనియెఁ

__________________________________________________________________________

*

 క. అసదృశముగ నరవీరులఁ| బసమీఱఁగ గెలువలేక పందక్రియ న్నీ
      వసి వైచి విఱిగివచ్చినఁ | బసులు న్విఱి... తిక్కపాలున్ న్విఱిగెన్

-- అని పాఠాంతరము అన్నములోఁ బోయునప్పుడు పాలు విఱిగిపోఁగా తల్లి యతనితో పరిహాసముగా నీ వాక్యమన్నదందురు.