పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

చిన్నయసూరి జీవితము

1. ఉపోద్ఘాతము

శ్రీ పరవస్తు చిన్నయసూరి పందొమ్మిదవ శతాబ్దిని విలసిల్లిన ప్రసిద్ధ పండితులలో ప్రథమగణ్యుఁడు. ఈతఁడు రచించిన గ్రంథములలో బాలవ్యాకరణమును, నీతిచంద్రికయు నూఱేండ్లనుండి పాఠశాలలోను, కళాశాలలలోను సయతముగఁ బఠనీయ గ్రంథములై పండితలోకమున ప్రామాణికములైనవి; ఆంధ్ర దేశమంతటను నధిక వ్యాప్తి నందినవి. అక్షరాస్యులగు నేఁటి తెలుఁగువారిలో నీతిచంద్రిక చదువని విద్యార్థి కాని, బాలవ్యాకరణము నెఱుఁగని పండితుఁడుగాని లేఁడని చెప్పుట నత్యోక్తియేకాని యతిశయోక్తి కాదు. ప్రాచీన కాలమున వచనరచనకు, వ్యాకరణరచనకు మార్గదర్శకుఁడగు 'నన్నయ్య' వలె నవీన కాలమున నీ రెండిటికి చిన్నయసూరి మార్గదర్శకుఁడగుటచేత "ఆనాఁడు నన్నయ్య, యీనాఁడు చిన్నయ్య" యను నానుడి యీతనియెడల సార్థకమైనది.

చిన్నయసూరి పై రెండు గ్రంథములేకాక బహుముఖముగా సంస్తవనీయమగు భాషావాఙ్మయసేవ గావించిన మహా