ప్రథమాంకము] సీతావనవాసము 7
ము నుపదేశించుచున్నది.
మేఘనాదాది మహావీరులారా, నాప్రతిజ్ఞ వినుఁడు:
మీరల్ రాక్షస వీరయోధులు బలామేయ ప్రభావైక దు
ర్వారుల్ పోరుల నే నరాంగనకునై స్వర్గం బధిష్ఠించి యు
న్నారో, యాధరణీ కుమారి యవమానం బొంది శోకార్తయై
ఘోరారణ్యములం దనాథయయి యెగ్గుంబొందఁ గల్పించెదన్.
[ఆశ్చర్యముతో] ఏమిది ! వారెంతలో అదృశ్యులైరి ! ఇదియేమి మనోభ్రాంతియా ? స్వప్నమా ? లేక సత్యమైయుండునా ? నన్నుఁ బ్రతిహింసకుఁ బురికొల్పుటకై పితృలోకవాసులు నాకు దర్శన మిచ్చియుందురు కాఁబోలు !
రాముని మోసగించి తనచేతనే సీతను గాంతారముల ద్రోయించి ఆ నృపతి గోడుగోడని దు:ఖింప నేను పకపక నగ నిలింప లోకవాసులగు మా బంధుసందోహము 'వహవా ! శూర్పణఖా !' యని నన్నభినందించునప్పుడు గదా నాజన్మము కృతార్థమగుట ! నేఁడే నే నయోధ్యకుంబోయి పూర్వాలోచిత కల్పనాక్రమంబున సమయమువేసి పగతీర్చుకొనియెద !
[నిష్క్రమించును.]