పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

117

తెప్పించినసనదు కొంతవఱ కాధారము కాఁగలదని యిట నుదాహరింతుము.

"శ్రీమత్సకలగుణసంపన్నులయ్ని శ్రీమహమేరుసమానధీరులయిన దేవళ్రాజు వెంకటాచలంకు నారయ్యగారు దండం స్న 1179 ఫసలి॥ మ॥ పెదమద్దాలి॥ వ॥ వుయ్యూరు తాలూకు దిట్టకవి రామచంద్రుఁడిగారి మాన్యము హ॥ సా॥ పంట్లకు సాలాబాదుచొప్పున సర్వదుంబాలాశెలవు యిచ్చినాము. మహస్సులు కమామిషు చేయించ్కొని కొంచ్చపోనియ్యవలెను. వికృతినా॥ సం॥ జ్యేష్ఠ శు 2 నారయ్య వ్రాలు”

ఇది నూజవీటిసంస్థానోద్యోగి కవిమాన్యము ఫలసాయము విషయములో ఠాణేదారునకు వ్రాసిన యాజ్ఞాపత్రము. ఇట్టివె ఫసలి 1168, 1169, 1170 లోనివిగూడ కవివంశీయులవద్ద మేము చూచి యున్నారము. ఇపుడు 1334-వ ఫసలీ కావున మనకు లభించినవానిలో మొదటి యాజ్ఞాపత్రమగు ఫసలి 1168 సం. సనదు ఇప్పటి 166 సంవత్సరములక్రిందఁ బుట్టియుండును. కవి యప్పటికి 20 సంవత్సరములవాఁడైనచో కవిజన్మకాలము క్రీ. శ. 1731 ప్రాంతములయం దైయుండును.