ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాంకము.
67
</poem>
రముఁ జేయఁగల్గుదుమా ! ఆర్యులమైన మనమనార్యలపాటి కృత జ్ఞులమై యుండఁ దగదా? రాజనీతి మాటయటుంచి తోడ్పడిన వారికి బ్రతిఫలముఁ జూపుట మానవ సామాన్యమగు నీతికాదా !
వ:-- శ్రీ రామచంద్రా ! నీవాముష్మికముమాటఁ దలపెట్టక దైహికం
బాలోచింపుము. వీరందఱికీ సమానస్వత్వ మొసంగిన మాపాట్లే మగును ? తరతరం బులనుండి బ్రాహ్మణ క్షత్రియ జాతులు రెండును మిధస్సాహాయ్యంబున వర్తించుట యెఱుంగవో! లేకున్న మీరాజ్యమును, మాకుల గౌరవంబును జిరకాలము నాడే పేరు లేకుండెడివి. కావున నట్టి యుపద్రవమును దప్పిచు టకే యింత తఱచి తఱచి చెప్పు చుంటిమి.
శ్రీ:- (చుఱుకు చూపులతో) దేశి కేంద్రా ! బ్రాహ్మణ సాహాయ్యంబు
వలన నే రాజులు రాజ్యమేలి ననియా మీ యభి(పాయము ?
వ: (అత్రముతో), కాదు, కాదు; క్షత్రియులు కత్తితో దీర్పఁదగిన
పనిని బ్రాహ్మణులు మాటలతోడనే తీర్చి రాజుల యలజడిని బాపి రని నా యభిప్రాయము.
శ్రీ: చిత్తము; మంచిమాటయే.
వ: కావున నీ రెండుజాతులు పశస్పర సౌభాత్రముననే సౌభాగ్యమును,
గౌరనమును నదియుండఁగఁవు. దీనికి వ్యతి రేకమయినచో నం తఃకలహములచే దినదినము సంక్షీణ భానమండఁగలవు. ఇది నిస్సంశయము.
శ్రీ:ఒక జాతి సౌభాగ్యమున కయి మఱి యొక జాతిని సర్వకాలసర్వా
వస్థలయందు బానిస తనము నందుంచి మూర్ఖులను జేయుట రాజ</poem>