54
శంబుంకవధ
అయినను శంబుకుని తోడఁ బ్రసంగించి చూచెదను. ఓరి ! యెవఁడు
రాయక్కడ?
దా:- (ప్రవేశించి, స్వామీ! యేమియాజ్ఞ ?
శ్రీ:- ఓరీ ! 'మొన్న కాంభోజ రాజు పాయనంబుగాఁ బంపిన యుత్తమా
శ్వమును సజ్జీకృతము గావించి వెంట నేగొనిరమ్ము
,
దౌ: చిత్తము. (నిష్క్రమించి మరల గుర్రముతోఁ బ్రవేశించును)
శ్రీ:- (గుర్రమెక్కి) చీ ! యెడమకన్నదురుచున్నది.కారణ మేమి
చెప్పుమా?
గీ| నాకు గురు వెన్ని స్మృతులు క్రో డీకరించి
చెప్పినను ధర్మమిదియంచుఁ జిత్రమే మొ
సంశయాత్ముఁడనైతినీ సమయమందు
గారణము మాత్రము మదికిఁ , గాన రాదు
గీ అంతరాత్మ పీడితుఁడను •నగుటచేతఁ
జేయునది లేక మన సెల్లు . జెదురుచుండె
నీట్టిసమయంబునను యుక్త మిదియటంచు
నెట్లుబుద్దికి బొడమునో •యెఱుగరాదు
- శ్చిదానందాశ్రరమము )
బడలికతో శ్రీరామచంద్రు'డు ప్రవేశించును.
శ్రీ:-అబ్బా ! సూర్యాతపముచేత డస్సిన నాసర్వాంగములను సేద
దేర్చుచున్న యీమృదు సౌరభ శీతలములగు' మలయ పవన కిశోర
ములు నాకు బ్రహ్మానందముఁ గూర్చుచున్నవి. పాంధులపధికా
యాసమును నపనయింప నేనెఱుంగకుండ నీయరామప్రతిష్ఠఁ,