పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

79


కౌలు దయచేసినను రావుగారి నిపుడు
తావకీనావలోకనోత్సవము నెఱవఁ
బిలువ నంపింతు ననవుడు నలుక వొడమి.

153


చ.

తరమిడి చూచి దమ్మనృపుధర్మనయప్రకటప్రసంగముల్
కరమును గర్ణశల్యములు గాఁగఁ బొరింబొరి నాటిన న్మహో
ద్ధురగతి ఖానుఁ డిట్టు లను దోర్బల సంపద విఱ్ఱవీఁగి య
ప్పురుషుఁడు మాకు మా ర్మసలి పోరఁదలంచినచూడ్కిఁ దెల్పెడిన్.

154


శా.

కౌలున్ వ్రాయము తాను రావలవ దింకం గోటపై ల్వెల్లి జా
గాలో నుండక లేచి పొ మ్మనుచు లేఖ ల్వ్రాసి పుత్తెంచు మీ
వేళం గూడకయుండెనేని నిఁక నీవే పోయి వేగంబ ఖి
ల్లాలో నుంచి వెడల్పు మంచు నతఁ డల్కం బల్క సెల్వందుచున్.

155


ఉ.

బొబ్బిలి వచ్చి దమ్మనప్రభుప్రవరుం గని ఖానునొద్ద నా
గుబ్బుకొనం జనించు పలుకు ల్సెవి నించిన ధైర్య మూఁది లో
నుబ్బెడు నర్థమోహమున నుక్కు మెయి న్బెదరించునేరుపుల్
దబ్బర సుద్దులాడుటలు తల్ప దివాణపువారినైజముల్ .

156


మ.

గరిమన్ జూపి దివాణ మర్ధకృతకాంక్ష న్వంచనాపూర్వభీ
కరచాటూక్తులఁ బల్కునంతనె గడీ ఖాలీయొనర్ప న్రిపూ
త్కరము ల్నవ్వఁ బలాయనంబు మదిలోఁ గావింప నెంతాటపా
టరుషాదర్పితుఁ డత్తురుష్కుఁ డనుచుఁ దక్కోడఁగా నేటికిన్.

157


ఉ.

కోరివయర్థ మెంతయినఁ గొమ్మని యీ నొడఁబాటుఁ జెందియు