పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

69


రిని భరియించు బందరుపురవరముం గర మొప్ప డాయుచున్.

100


సీ.

అభ్రంలిహాదభ్రహరిహయాయుధశిలా
       కలితసౌభావళు ల్గాంచి కాంచి
మందురామందిరసందీప్తజవనాశ్వ
       సుందరాకృతిగతు ల్సూచి చూచి
వివృతాస్యగహ్వరవిస్తారితాయోమ
       యాగ్నేయయంత్రంబు లరసి యరసి
సమదసామజఘటాచటులగమాగమా
       తిప్రసంగములను దెలిసి తెలిసి


తే.

రక్తరాంకనకంచుకయుక్తదృప్త
పాణితలచాలితకృపాణపటలజటిల
భీకరకరాళవదను లై పేర్చువారిఁ
గ్రూరులఁ బరాసుజనులఁ గన్గొనుచు నరిగి.

101


ఉ.

రాయవకీలు కట్టెదుట రాజిలు నొక్కచిరత్నరత్న నూ
త్నాయతనంబునందు గొలువై చెలువైన యొయార మింతయౌ
రా యనఁ గానుపించి రుచిరాయనకీర్తిదురంధరుండు నా
రాయణుఁడో యనం జెలఁగు రాయని గాంచెను రెడ్డినాయనిన్.

102


తే.

కాంచి యాభాగ్యసంపత్తి కౌరవేంద్రు
సాంద్రకరుణాతరంగముల్ సంగ్రహించి
సరస గూర్చుండి తనకార్యసరణి యప్పు
డతని కంతయుఁ దెల్పెఁ బండితవరుండు.

103


చ.

అతఁడును నట్టికృత్యమున కద్భుత మంది యనింద్యకీర్తిరా
జతనికి నేమిటం గొఱత యన్యులసొమ్ముల కాస గోరి దు