పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయా శ్వా సము.

67


క్కం గానం డొకొ వెల్మబిడ్డ మములం ఖాతీరుకుం దేఁడొకొ.

89


మ.

ధరణీమండలి నుండు నెల్లరు జమీదారు ల్భయం బంది మా
ఫరమానా శిరసావహించుకొనిరా పాటింప కారాయఁ డీ
సరణిన్ రామికి నేమి చెప్పదన కేల్ శెంషేరుతారీపుచే
నరుదేర న్మదిఁ దల్పఁడేమొ యతఁ డాహా మేల్సిఫాయీగదా.

90


చ.

తురకల రాజ్య మౌట మదిఁ దోచక యున్నదొ నాధ్వసావహూ
ద్ధురరణరంగవిక్రమము దోగెడువారు ఫరాను లన్నపే
రెఱుఁగఁడొ రావు రాకునికి హేతువు గానని మాకుఁ దోఁచె ని
ప్పఱుసుదనాన మ మ్మతఁడు భావమునందు ఫసందుసేయఁడో.

91


చ.

విపులపరాక్రమాతిశయవిశ్రుతమూర్తి నటంచుఁ దోడిధా
త్రిపులు దొఱంగి పాఱ బెదరించెడిచాడ్పున నిప్పరాసులం
గపటమనస్కతం జులక గాఁ దలపోయుట లెల్ల వేఁడి గా
లపుసిడిగా నిగంపసిడిలాగున నుండదు మన్నెఱేనికిన్.

92


శా.

ఫల్లామంచిది రావుగారు తనదోఃపాండిత్యసంపద్బలా
ద్యుల్లాసంబున గర్వితుం డగుచు రా కున్నాఁడు గాఁబోలు మే
మెల్ల న్మీదొరదర్శనంబునకుఁ గా నేతెంతు మంచు న్మనా
గ్భల్లుండై ఖరడాజవాబు నడపెన్ ఖానుండు తద్దూతతోన్.

93


ఉ.

అంతట నవ్వకీలు వినయమ్మున లేచి సలాము చేసి మీ
యంతటిఖానుసాహెబుల నాదరణోక్తులఁ బల్కఁ బాడియే
సంతతధర్మశాలి విలసన్నయశీలి మదీశ్వరుండు గో