పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

రంగారాయ చరిత్రము


పున కామన్నెకుమారుపౌరుషరసంబు ల్వల్కగా నేల న
ర్జునగంగాసుతకుంభసంభవులనేర్పు ల్గావె తద్దర్పముల్ .

35


తే.

అనుచు నారాజు పలికిన యాగడంపు
ముచ్చటల కబ్బురం బంది మొఱకుతురక
కఱఁకుఁదన మూఁది కొనవేలిఁ గఱచికొనుచు
నాగ్రహమ్మున నతనితో ననియె నిట్లు.

36


శా.

ఏలా జేరుకు రాఁ డతండు పయికం బేలా దివాణాన కీఁ
జాలం డస్మదపారఘోరనిబిడజ్వాలాకరాళాయితా
భీలక్రూరశతఘ్నికానికరగంభీరారవప్రౌఢిమం
బేలా గుర్తెఱుఁగండు చూత మిఁకఁ దద్భీమప్రతాపోద్ధతుల్.

37


శా.

కీలాభీలము లిప్పరాసులఫిరంగీ లగ్నిమూర్తు ల్మహా
కాలుండై నను గాలుఁడైన నెదురంగా నోప రిచ్చోట మ
న్నీలంచుం బలుకంగ నేటికి పఠాణీల న్హిరాణీతురా
ణీల న్గోటను జిమ్మలేదె మును బిన్నీబారులం బోరులన్.

38


సీ.

తలఁపుతాశ్శీళ్లలో మెలఁగఁజేసితిఁ గదా
       శకసింధుఘూర్జరాశ్మంతపతులఁ
జేరుదస్తునకుఁ దెచ్చినవాఁడనే కదా
       మరహాట కరహాట మత్స్యపతుల
ధర బందిగీలఁగాఁ దార్చి తెచ్చితి గదా
       మాళవ చోళ నేపాళనృపుల
తజివీజులో మెల్ల రుజువు జేసితి గదా
      నానావగైరాల నాఁడునాఁట