పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

55


బొబ్బిలికోటపై నడచి పోరఁగ రాదు కిరీటికైన మా
యబ్బపదంబు లాన నిజ మాడెద హైదరుజంగుసాహెబా.

29


మ.

మదదంతావళగండశైల మరిభీమస్యందనక్ష్మావహం
బుదితక్షిప్రహయావళీహరిణ ముద్యోతత్ప్ర తాపాతపా
స్పదపాదాతమృగేంద్ర మవ్వెలమరాజక్రూరమంథాద్రి వై
ర్యుదధిన్ వ్రచ్చుట వింతయే ముసలిమా నుర్వీపతిగ్రామణీ.

30


ఉ.

నాలుగువేలకాల్బల మనారతముం దనుఁ గొల్వ నాపయిం
జాలిన మేటిమాననులు సాహసధుర్యులు పద్మనాయకుల్
కాలునఁగాలు మెచ్చికొనగాఁ దగియుండు సహస్ర మమ్మహీ
పాలునియొద్ద నాఘనుఁ డపారపరాక్రముఁ డెన్నిభంగులన్.

31


ఉ.

కావున బద్మనాయకశిఖామణి యైన మహానుభావుఁ డా
రావుకులాగ్రగణ్యుఁడు దురాగ్రహబాహుబలప్రభూతగ
ర్వావిలమానసుం డయి దివాణమువారలఁ జీరికిం గొనం
డావిభుఁ డెట్టిధన్యుఁడొ భయంపడఁ డెంతటిఖాన్నిఘాలకున్.

32


తే.

సీమలోపల పితరులు చేసికొనుచు
సిస్తు వడనీఁడు పైకంబు దస్తుగాఁగ
నివ్వఁ డవ్వల నిఁక నేమి ఱవ్వబలుక
వారు తమజేరు దస్తులో రారు నిజము.

33


మ.

అని రాజన్యునితప్పుదాట్లు కుటిలవ్యాపారసంభాషణల్
వినుచో హైదరుజంగుసాహెబు కడు న్విస్మేరచేతస్కుఁడై
నిను ము న్విందు మమందశౌర్యకలనానిస్తంద్రసైన్యావళీ
ఘనసంరంభి వటంచు నవ్వెలమ నీకన్నన్ బలాఢ్యుండొకో.

34


మ.

అన నారాజవతంసుఁ డిట్టులను నాహా తాండ్ర పాపయ్యనాఁ
జనువాఁ డొక్కఁడె చాలు మామకభుజాశౌర్యంబుఁ గోల్పుచ్చుం తెం

.