పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

49


నొకవంకఁ గోవిదప్రకరముల్ నిరతంబు
       ఘనతర్కశాస్త్రంబు లనువదింప
నొకవంక నిపుణవైణికవాంశికనికాయ
       గాయకు ల్గానసంగతులు సలుప


తే.

నోలగం బుండి తనలోన నూహఁ జేసి
యతిభయావహయవనసభాంతరస్థ
జనమనోహరభూరివచఃప్రసంగ
శీలు నొక్కవకీలు వీక్షించికొనుచు.

4


క.

యావనసభాంతరంబుల
నీవు బహుప్రౌఢి మెలఁగ నేర్పరివి వచః
ప్రావీణ్యశాలి వని సం
భావింపుచు రాజకార్యఫణితిం బలికెన్.

5


చ.

యవనజనావతంస మగు హైదరుజంగుకచేరిఁ జేరి నీ
వివిధవచోవిచక్షణత వేడుకఁ గొల్పఁ గళింగసీమతోఁ
దవిలిన రాచకార్యము యథావిధిగాఁ బయికంబుతో నిఖా
వివరణఁ జేసి మాకు సెల విం డని తెల్పుడుఁ జేసి వెండియున్.

6


శా.

ముం దెల్లప్పటికిం గళింగమునకున్ మోతాదు గాఁగన్ జమా
బందీద్వాదశలక్షరూపికల కేర్పా టున్న దాచొప్పు పెం
పందన్ సా మిపు డిచ్చి పుచ్చెదము పర్యాయంబునన్ సాము మీ
కుం దోడ్తోడన మీరు లేచి తిరుగా గోదావరిం దాఁటినన్.

7


క.

అని రాజియసంగతు
లనువుపడం దేటపఱచి హైదరుజంగుం