పుట:2015.373190.Athma-Charitramu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 274

గలిబిలి జర్గకుండా 400 కనిస్టేబిలు పిల్పించ్చి ఘాట్లు ఫారాలు యేర్పర్చినారు. చోరీలు మొదలయ్నివి యేమీ జర్గకుండా సబుకల్కటరుధొరవారు శ్రధన్ పుచ్చుకున్నారు.

"వేలివెన్ను పశువేదలవారు యావన్మందింన్ని, ధవిళేశ్వరం నుంచ్చి చింనప్పామన్ను, క్నకంమ అత్తగారుంన్ను ఆమె నాలుగో కుమార్డు కృష్ణమూర్తిగారుంన్ను యిక్కడ మ్నయింట్కి వచ్చినారు. నింన కొంత్తమందింన్ని, యీరోజున కొంతమందిన్ని వారివారి గ్రామములకు వెళ్లినారు.

"షుమారు 10 రోజులునుంచ్చి విశూచి జాడ్యములు కనిపించ్చి రోజు 1 కి షుమారు 10 మంది జ్నంచొప్పున చనిపోతుంన్నారు. యిక్కడ యితరదేశపు ప్రజలు వారివారి దేశముల్కు వెళ్లిపోయ్నీరు.

"లక్ష్మీపతిగారి నింన్ని రామచెంద్దర్రావుగార్నింన్ని చూచినాను. తమకు యివ్వవలశ్ని వెంకటచెలంపంత్తులు గారు యింక్కా యివ్వ లేదనింన్ని యిచ్చిన వెంటనే పయిసలు చేయిస్తానని లక్ష్మిపతిగారు శల్వుయిచ్చినారు. వెంకటచెలంపంత్తులుగారు య్నీం అంమ్మకమయ్నిసొంము యీగ్రామంలో మెర్కవీధికాపులవద్ద నిలవ వుంన్నది. రామచెంద్రరావుగారు చెప్పిన దేమనగా, కొంతదస్తు శిధంగా వుంనదనింన్ని తతింమ్మాదస్తు 10 రోజులలో తాము జమీగ్రామములలో నుంచ్చి రాబడుననింన్ని తప్పకుండా యిప్పిస్తామనిన్ని చెప్పినారు. *** రామభద్దిర్రాజు గారు 4 రోజులకిందట కోటున్ పనినిమిత్తం రాజమంద్రికి వచ్చినారు. వీరభదృడు కూడా వుత్తరం వ్రాసినాడు. 4 రోజులలో రేలంగి వెళ్లి యిలిందలపర్తి వ్యవహారం పరిష్కారం