పుట:2015.372978.Andhra-Kavithva.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

56


యత్యుత్తమ మైనదనీయుఁ, గావ్యము మానవుని విచారములఁ బోఁగొట్టి ధైర్యము నొసఁగి చిత్తశాంతిఁ జేకూర్చి యుత్తమ గతి నొడఁగూర్చుననియుఁ, గావ్యమున నీతి మృగ్యము గాఁ గూడదనీయు, మఱి ప్రధానముగ నే యుండవలయు ననియు, నీతి లేని జాతులన్నియు నశించుననియు, నీతి బగ్గమయినజూతి చీరసాయిగ వర్దిల్లుననియు, నుత్తమపరమావధిగల కావ్యము సత్పు రుషులయొక్కయు, నీతియుతుల యొక్కయు, మహాపురుషుల యొక్కయుఁ జరిత్రములను గావ్యముల వర్ణింప వలయుననియు, సామాన్యమానవుని జీవితము నిసర్గముగ వర్ణ నీయము గాద నియుఁ, గవియొక్క శక్తియంతయు సర్వకాలములకును, సర్వ దేశములకును, సర్వమానవులకును వర్తింపఁగల మహావాక్యములను నీతి వాక్యములను రచించుటయే యనియు సిద్ధాంతముల జేసి స్వాతంత్ర్యరకులగు షెల్లీ. బై రణ్ - కీట్స్ మొదలగుకవు లను నాదర్శప్రాయులుగ నంగీకరింపక పూర్వులగు గ్రీకు రోమన్ కవులనే యాదర్శప్రాయులుగ నంగీకరించెను.

6. రస్కిను, కాథ్లెలు వర్గము వారి మతము.

ఆర్ నాల్డు కవియొక్క వాక్యము లాకాలపు టాంగ్లేయు లకు శ్రవణ కఠోరములుగ నుండెను. కాని రసశాస్త్ర వేత్తయగు రస్కిన్ యొక్కయు, సంఘలోపముల నచయుఁడై ఖండించిన కాగ్లైలు యొక్కయు వాక్యములు 'ఆర్' నాల్డుని మతమునకు వ్యాప్తిగల్గిం చెను 'రస్కిన్ కాగ్లైలు లిరువురును నాంగ్ల దేశమునం బ్రకృతిశాస్త్ర విజృంభణము వల్ల నీతి యడుగంటుచున్న దని భయపడి దేశ క్షేమమునకై నీతి వాదమును సమర్థించుచుఁ గొంచె మత్యు క్తి దోషమునకు సహితము పాల్పడిరి. ఫోన్సున సెయింట్