పుట:2015.372978.Andhra-Kavithva.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


నార్హులుగఁగూడ నెన్నఁబడుచున్నారు. అట్టిచో ధర్మశాస్త్రము కవి నెంతవఱకు బంధించును ? కవి ధర్మశాస్త్ర నిర్ణయములకు వ్యతిరేకముగాఁ గావ్యము రచియింపవచ్చునా? అట్లు రచించుట సత్రావ్యలక్షణ మగునా? ఈ ప్రశ్నములకు సోదాహరణములగు ప్రత్యుత్తరములను సంపూర్ణముగ నింకొక సందర్భమున విన్న వించెదను. ప్రస్తుతము స్థాలీపులాకన్యాయమునఁ గొంచెము సమాధానము సూచిం చెదను. కవి రచించెడి కావ్యము ప్రపంచమును, నందలిజీతమును, ఛాయాపటమురీతి ననుకరింపక, స్వతంత్ర ప్రపంచమును సృష్టిం గావించునని యీవరకే తెల్పి యుంటినిగదా! ప్రకృతులు భిన్నము కానప్పుడు వానికి వర్తించు సూత్రములును భేదింతమానవు కదా! ధర్మశాస్త్ర, మెప్పుడును బ్రకృతుల కనుగుణముగ సమర్థింపఁబడును గాని వేఱుపద్ద తులఁ గావింపఁబడదు. ధర శాస్త్రము నుపనిబంధిం చునవి దేశ కాలపొత్రములు. 'దేశ కాలపాత్రములు మాజుకొలఁదిని ధర్మ సూత్రములును మాఱుచునే యుండును. కవి 'దేశ కాలపాత్ర ములపై ననే యాదారపడియుండఁడు. దేశ శాలపొత్రముల కతి తమును, స్వతంత్ర, జీవనరహితమును నగు రసప్రకృతి కాధార ముగఁ గొనును. అందువలనఁ దనచేఁ గల్పితమగుఁ బ్రకృతి కనుగుణముగ స్వతంత్ర ధర్మ సూత్రములను ధర్మసూక్ష్మములను గవియే నిర్ణయించుకొనునుగాని యొకరుగావించినధర్మశాస్త్ర ము నాధారముగఁగొని కావ్యములలోని పాత్రములకుఁ బార తంత్ర్యము ఘటింప నిచ్చగింపఁడు. మూలసూత్రములను మిగి లినవిషయములనుగూడఁ 'గావ్యము లవలంబించుధర్మశాస్త్రము నళును, సాధారణమగు ధర్మశాస్త్రమునకును వ్యత్యాస మెంత యేనియు నుండును. ప్రధానసూత్రముల రెండింటికిని నీ ముఖ్యం.