పుట:2015.372978.Andhra-Kavithva.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

ద్వితీయ

ఆంధ్ర కవిత్వచరిత్రము


మతములన్నియు మాసిపోవును
జ్ఞాన మొక్కటి నిలిచి వెలుఁగును
అంత స్వర్గసుఖంబు లన్నని
యవని విలసిల్లున్

సూత్రప్రాయముగ నున్న మొదటి నిర్వచనమున నంతర్గర్చిత ములుగనున్న భావములను గొన్నింటిని సూచింపఁగల్గితిని, మిగిలిన భావములు విశిష్టసంస్కారులకు గోచరింపకపోవు. " - పండిత రాయల నిర్వచనము. ఆ ఇఁక వ్యాఖ్యాన రూపముననున్న పండిత రాయల నిర్వచ నమును గొంచెము పరిశీలింతము. సజాతీయములును విజ తీయములును నగుభావములచే మార్పుఁజెందని మూర్తిగల దియు, రసమునంతయు ప్రదర్శించు నట్టిదియు నగుభావమే స్థాయీభావమని చెప్పఁబడినది" ఈనిర్వచనమునందలి "సజా తీయవిజాతీయ” అనుపదములు మొకటి నిర్వచనమునందలి “విరు ద్దైరవిరుద్ధా” అనుపదములయర్థమునే యొసంగుచున్న వి. ప్రధానభావము తదనుగుణములును విరుద్ధములును నగు భావములచే మార్పునొందక రసమును సర్వమును ప్రదర్శించు ననియే పండిత రాయల నిర్వచనముయొక్క" యర్థము. మొదటి నిర్వచనమునందలి “ఆత్మ భావం సయత్యన్యాన్” అనుభావ మును, లవణాకరునితోటి సామ్యత్వమును భావగాంభీర్యమును బండిత రాయలనిర్వచనమునఁ గానరావు,

స్థాయీభావమే రసము.

ఈ కావున స్థాయీభావమునకుఁ బ్రధానలక్షణము విభావాది కము చేతను విరుద్ధములగు పంచారీవ్యభిచారాదిభావముల