పుట:2015.370800.Shatakasanputamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశకుల విజ్ఞప్తి

సహృదయులారా!

ఆంధ్రవాఙ్మయమునఁ బేరెన్నికగన్న శతకములను విషయములనుబట్టి విభాగములు గావించు సంపుటములుగఁ బ్రచురింపఁ దలంచి యనేకశతకములను ముద్రితాముద్రితముల నార్జించి శుద్ధప్రతులు పీఠికలు వ్రాయించి సిద్ధపఱచితిమి. శ్రీయుత గురుజాడ అప్పారావుగారిద్వారా మాయుద్యమమును విని శ్రీ విజయనగర సంస్థానాధీశ్వరులగు మీర్జా శ్రీ రాజా శ్రీపూసపాటి విజయరామగజపతి మహారాజా మన్నెసుల్తాన్ బహదర్ వారు కాగితములవ్యయము భరించి శతకసంపుటముల ప్రచురణమునకుఁ దోడుపడుదుమని వాగ్దాన మొనరించి మమ్ము సర్వవిధములఁ బ్రోత్సహించి మాయుద్యమముపై సానుభూతిఁ జూపిరి.

కాని, శతకకవులచరిత్రము వ్రాయుచు శ్రీవంగూరు సుబ్బారావుగారు మాయొద్దనుండి శతకప్రతులు దీసికొని తిరుగ నొసంగక యెన్నిపర్యాయము లడిగినను ఇదిగో అదిగొ యని మాకీయకపోవుటచే సంకల్పించిన శతకసంపుటప్రచురణమునకు శ్రీ విజయనగర మహారాజావారి తోడ్పాటుపొందుటకు అంతరాయముకలిగినది. వ్యయప్రయాసములకు లోనై వ్రాయించినప్రతులు గైకొని పని