పుట:2015.370800.Shatakasanputamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

చెన్నబసవని స్తుతించుచు చెన్నమల్లు సీసపద్యములు గావించెనని ప్రజాముఖమున వినుచున్నారము.

సోమనాథుఁడు జీవసమాధి కేగుచు భూబిలమున కేర్పఱచిన ముప్పదిరెండుమెట్లను దిగనెంచి యొక్కమెట్టు దిగునపు డొకపద్యము చొప్పున ముప్పదిరెండుపద్యములు రచించినటుల శైవులుకొందఱు చెప్పుచున్నారు. సోమనాథకవి సిద్ధిపొందినస్థలము పాలకురికి నిజామురాష్ట్రమున ఒరంగల్లునకు మూఁడామడలదూరములో నున్నది. సిద్ధిపొందినచోట నొకశివాలయము గట్టి శివభక్తులు పూజాదికములు ఉత్సవములు సలుపుచున్నారు. సోమనాథుని చెన్నమల్లుసీసము లచటియుత్సవాదులలో నేఁటికిఁ బ్రచారములో నున్నవి.

ఈకవిజీవితము వృషాధిపశతకపీఠికలో వ్రాసితిమి. కవికాలము క్రీ. శ. ఇతనిశైలి పాండిత్యము ధారాశుద్ధి ప్రశంసనీయములు. చెన్నమల్లుసీసములు పూర్వముద్రితప్రతిలో దుష్టముగానుంటచే లిఖితప్రతుల సహాయమున సంస్కరించి నూతనపద్యములు చేర్చి సాధ్యమగునంతవజకు నిర్దుష్టము గావించితిమి. ఫలశ్రుతినిగూర్చియుఁ బద్యానుక్రమణికను గూర్చియుఁ గలవద్యము లిందుఁ జేర్చితిమి.

నందిగామఇట్లు భాషాసేవకులు,
1-1-25శేషాద్రి రమణకవులు, శతావధానులు.