పుట:2015.329863.Vallabaipatel.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

19

జెందినాఁడు. అంధప్రాయముగ గాంధీజీ ననుసరించుచుంటి నన్నాఁడు. ఎంతటి వింత! ఎంత తాఱుమాఱు!.

ఆయన పూర్వ ప్రస్తుత పరిస్థితులనుగుఱించి 1921లో నొక సభయం దిట్లు ప్రసంగించెను. "మొట్టమొదట నేను షోకిల్లాను. రసికుఁడను. రాజకీయములలోఁ బాల్గొనుటకంటెఁ జీట్లాటయే వేయిరె ట్లధిక మనుకొంటిని. ఈ మోసపు రాజకీయములన్న నాకు సరిపడునదికాదు. కాని గాంధీమహాత్ముఁ డీ కర్మక్షేత్రమునఁ గాలిడినాఁడు. ఆయన ప్రభావమువల్ల నేను మాఱిపోయొ రాజకీయములోఁ జేరితిని."

అసలు విషయ మేమి యన, నాయన యెంత పాశ్చాత్య వ్యామోహములోఁబడినను, శత్రువులను జులుకన చేయవలెనను భావ మెంతయున్నను వీని యన్నిటికి వెనుక నొక యద్భుతసమైన క్రియాశక్తి, యొక యఖండమైన సేవాభావము దాగి దోబూచు లాడుచుండెడిది.

ఆ సేవాభావమే, యా దివ్యశక్తియే, యాయన మిత్రులను, క్ల యింటులను గొప్పగొప్ప యఖాతములనుండి తప్పించి రక్షించినది. పటేలు వారికి రక్షకుఁ డయ్యెను. మహాత్ముని ప్రభావమువల్ల నా పై పొరపోయి యాంతరంగికభావ మభివృద్ధిచెందినది.

మహాత్మునితో సన్నిహితభావ మేర్పడఁగానే తన బిడ్డలను గాన్వెంటులోనుండి మాన్పించి మహాత్ముని పాదముల వద్దఁ జేర్చినాఁడు. పటేలు గాంధీజీ కన్నిటఁ గుడిభుజముగా నుండి యధికసమర్థతతోఁ బాటుపడుచుండుట నేటి ప్రపంచమునకు విదితము.