వివాహము
81
సంబంధము, అధర్మజ సంతతి సంబంధము, దత్తక సంబంధము, రక్తజ సంబంధము, కూడ జేర్చబడినవి.
శాస్త్రీయ వివాహమున కేర్పరుపబడిన షరతులన్నియు ధర్మయుక్తములే యట. ఆలోచించి చూచిన నిది యంతయు గల్ల యని వ్యక్తము కాగలదు . ఆలోచించి చూడగ నిందలి మొదటి విషయమే పొరబాటుగ దోచుచున్నది.
సిద్ధాంత ప్రకారము స్త్రీ కొక్క వివాహమే యుక్తము. పతి యున్నను, మరణించినను స్త్రీ పునర్వివాహము చేసుకొన దగదు.
"నతు నామాపి గృహ్ణీయా త్పత్యా ప్రేతే పరస్య చ"
(మను. 5-157)
"సకృదంశో నిపతతి సకృత్కన్యా ప్రదీయతే"
(మను. 9-47)
"అయం ద్విజైర్హి విద్వద్భిః పశుధర్మో విగర్హితః
మనుష్యాణామపి ప్రోక్తో వేనే రాజ్యం ప్రశాసతి"
(మను. 9-66)
“న వివాహవిధావుక్తం విధవా వేదనం పునః."
(మను. 9-65)
సావిత్రి మొదలగు వారే భయంకరాపత్తులో బడవలయునని యెఱింగియు మానసిక నిర్ణయమును మార్చుకొన లేదు గదా ! అట్టి స్థితిలో భర్త సజీవుడై యుండగనే యాతని విడచి స్త్రీ పునర్వివాహము చేసుకొనుటయనున దెంతయు నధర్మము కాదా ? ఇందు వేఱుగ జెప్పవలయు నదే మున్నది ?