ఉత్తరభాగము . ఆ. 2.
261
క. దీనికిఁ దగ మీరును మీ, సేనాసముదయముతో విశృంఖలలీలం
బూని నడచి పగతుపురం, బైనమధుర పొదివి వైర మడఁపఁగ వలయున్.
జరాసంధుఁడు రెండవసారి మధురమీద దండెత్తివచ్చుట
తే. మనబలంబు లనంతంబు లనుపమములు, యాదవులు వీతసాధను లర్ధహీను
లేను బొదివి నిరోధింప నెల్లభంగిఁ, జెడుదు రొగి సందియము లేదు కడఁగుఁడోపి.8
వ. అనిన నందఱు నవ్విధంబున కియ్యకొనిరి జరాసంధుం డనతిచిరం బగు కాలంబున
సమస్తసైన్యసమన్వితుం డై కదలె గోత్రజులును సంబంధులును సుహృదులు నైన
రాజులును గోమంతశైలంబునం జాల భంగపడుట నభిమానంబు పూనినభూనా
థులు నతని ననుగమించిరి విశేషించి విష్ణుద్వేషు లైన పౌండ్ర కళింగ దంతవక్త్ర
శిశుపాల సాల్వ రుక్మి యవన వేణుధారి సౌవీర గాంధార త్రిగర్త భగదత్తు
లును మఱియు నంగ వంగ సుహ్మ విదేహ కాశ కరూశ దశార్ణ మద్ర పాండ్యదేశా
ధీశులు నుత్సాహంబునం బేర్చి తత్సహాయు లై చని రివ్విధంబున నిరువదియొక్క
యక్షౌహిణులతో నతండు కతిపయప్రయాణంబుల నరిగి మధురాపురోపవనం
బులు సన్నివేశంబులుగాఁ గైకొనిన.9
తే. విష్ణు మున్నిడుకొని యప్డు వృష్ణివరులు, కోటపై నుండి యా సైన్యకోటేఁ జూచి
యుగసమాప్తికాలంబున నుల్లసిల్లు, నుదధియో కాక యని వెఱగొందుచుండ.10
క. సీరిఁ గనుంగొని నవ్వుచు, శౌరి యనియె భూభరంబు సయ్యన మాన్పన్
గోరి యొకో విధి యిచ్చట, నీ రాజులనెల్ల నొకట నిటొలోడఁగూర్చెన్.11
వ. దుర్జనుం డగు నీజరాసంధునిమిత్తంబున వీరు లిందఱకుఁ బ్రాణాంతకారి యైన
యాపద సంప్రాప్తం బయ్యె నది య ట్లుండె ననేకదేశనివాసు లగు వసుధాధీశుల
యడియాలంబులతోడి గొడుగులుం బడగలుం జూడు మీకూడిన మూఁకలం
గ్రీడయపోలె దునుమాడవలయు సన్నాహసమేతుల మై వెడలుద మనియె
నంత.12
తే. యముననిడుపెల్ల విడిదల యై తలిర్ప, బలము విడియించి మగధభూపాలకుండు
మనుజనాథులఁ బిలుపించి మంతనమును, గార్యమంతయు నూహించి కడఁకమిగుల.13
క. అరుదుగ గాడ్పున కైనను, జొర [1]నెడయును లేక యుండఁ జుట్టును ముట్టం
ద్వరితముగ వలయు నీపురి, వెరవు ప్రయోగింపుఁ డిట్టి విధమునకుఁ దగన్.14
వ. అని పలికి తదనురూపంబుగా నవ్విభుండు.15
సీ. గుద్దండ్లనుం బెద్దగునపంబులను గోట యొండొండ త్రవ్వుట నుక్కుటులుల
రాకట్టనపుటెడల్ గైకొని నఱకుట యొనరుదంచనముల నొడిసెలలను
- ↑ వెడలఁగరాక