ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
273
దుర్వార శౌర్యసందోహ ప్రచండ 1415
గర్వితారి మదేభకంఠీరవుండు
భీమబలాఢ్యుండు భీమసేనుండు
భూమి తల్లడమంద భుజగేంద్రుఁ డదర
తారలు ద్రుళ్ల దిక్తటము లల్లాడ
భోరున శంఖంబుఁ బూరించుటయును; 1420
తనమది నుప్పొంగి తమకించి ధర్మ
తనయుండు నాగకేతను నిరీక్షించి
అదె విను భీమశంఖారావమహిమ
కదనంబు చాల నగ్గల మయ్యెనేమొ
పదపదం డని బెట్టు పలికిన వేగ 1425
ధర్మరాజుభీమునొద్దకువచ్చుట
గదలి యాభీముని గదియఁగా నేఁగి
తనకు మ్రొక్కిన వాయుతనయుని గ్రుచ్చి
యొనరఁ గౌఁగిటజేర్చి యుప్పొంగె రాజు
పావని యప్పు డాపాంచాలిపుత్త్రి
భావించి సంతోషభరితుడై చూచి