ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
265
పవనతనూజునిపట్టి పదునాల్గు
భువనము ల్గలఁగ నద్భుతముగ నార్చి
కాలాంతకుని లీల గద యొక్క చేత
శూలంబు నొకచేత సూటిగాఁ బట్టి
గురుభీష్మకులమీఁదఁ గ్రోధించి గదిమి 1285
వరమంత్రయుతముగా వై చె; వైచుటయు
నవి రెండు చండమార్తాండ తేజముల
వివిధాగ్ని లీలలు విస్ఫులింగములు
గ్రక్కుచు దశదిశల్ గ్రమ్మి యేతేర
మక్కువఁ గాంచి భీష్మద్రోణు లపుడు 1290
గరుడపావకరౌద్ర కమలాప్తకులిశ
వరుణపన్నగ మేఘవాయుబాణములు
నిగుడింప నవి యెల్ల నీఱు గావించి
తెగువ నేతెంచిన దివ్యాయుధములు
గనుఁగొని గురుఁడు గంగానందనుండు 1295
జననాథుసోదరు ల్జగతీశ్వరుండు
గురుతనూభవకృఫుల్ కుంభినీధవులు
పరువడి భగదత్తబాహ్లీకముఖ్యు