పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

97


మూల ప్రకృతి పరబ్రహ్మమునకంటే వేఱనియు, అదే పరబ్రహ్మశక్తి యనియు, ఆ శక్తిమూలముననే పరబ్రహ్మము సృజించుచు న్నాడనియు జెప్పుటవలనదోషమేమియును లేదు.

యథార్థ స్థితిలో నిట్లు చెప్పినను పరబ్రహ్మముమాత్రము సవికారుఁడు కానక్కఱలేదు. ఏలయనిన ; లోకమునందు కర్తృత్వము రెండుతెఱఁగులై యున్నది. కొందఱు స్వయముగఁ గొన్ని సాధనములఁ గైకొని కార్యములు సాధించు చున్నారు. మఱిికొందఱు తామేమియుఁ జేయకయే పరులచేఁ సర్వ కార్యములఁ జేయించుచున్నారు. ఈ రెండు తెఱంగుల వారిని కూడ లోకమునఁ గర్తలనియే చెప్పుచున్నారు. ఇందు మొదటిది సాధన సాధ్యకర్తృత్వము (సాధనములఁ గైకొనియే కార్యముల సాధించుట వలనఁగలుగు కర్తృత్వము), రెండవది సాన్నిధ్యమాత్రసాధ్యకర్తృత్వము (స్వయముగ సాధనములఁ గైకొన కున్నను తన సామీప్యమువలనఁ బరులచేఁ గార్యముల సాధింపఁజేయుటవలనఁ గలుఁగుకర్తృత్వము) ఈ రెండవకర్తృత్వము పరబ్రహ్మమునకుఁ గలదు. ఆయనయుఁ దనకంటె వేఱుగా నున్న ప్రకృతిచేఁ బ్రపంచ సృష్టినిఁ జేయించుచుండవచ్చును గదా!

ఈ ప్రకృతి పరబ్రహ్మమునకు శక్తియే యైననుగూడ నీకర్తృత్వమునకు భంగము రాదు. పురుషునికంటె వాని యందున్నశక్తి వేఱనుటలో సంశయ మేమియును లేదు. శక్తికిని శక్తిగలవానికిని సమవాయసంబంధము, (అనఁగా : నిత్యసంబంధము) కల దని తార్కికు లందురు గాని అ ది వేదాంతులకు సమ్మతము కాదు గదా. యథార్థ స్థితిలో పదార్థములు రెండైనప్పుడు అవియొక్కటిగానే యున్నట్లు భ్రాంతివలనఁ దోఁపవచ్చునేకాని ఆట్టినిత్యసంబంధముకూడ నొకటి కలదనుట యుక్తిశూన్యముకదా ! ఇట్లు సర్వమును విమర్శించిన భ్రాంతిసిద్ధమగు భేదము నాశ్రయించి పరబ్రహ్మము నందు కర్తృత్వ మారోపింపఁ బడుచున్నను అపరబ్రహ్మమునకు మాత్రము వికార ములు కలుగ నక్కఱలేదు.

ఈతత్త్వము నెఱుంగలేక యజ్ఞానులగువారు నాచే (మూల ప్రకృతిచే) జేయఁబడుచున్న సకలకార్యములను నిర్వికారుఁడగునాపరబ్రహ్మమునం దారోపించు చున్నారు. అమ్మహాత్మునకు దేనితోను సంబంధము లేకుండినను, ఆకాశమువలె సర్వవ్యాపకుఁడై యుండుటచేత నా ప్రకృతియందుగూఁడ వ్యాపించియే యన్నాడు. కావుననట్లు కల్పించుచున్నారు. మాయ ఆ బ్రహ్మమున కుపాధి యనియు, పరబ్రహ్మము తన యందుండుటచే నామాయయే సర్వమును సృజించుచున్న దనియు, బ్రహ్మమునకు నీసృష్టితో నేమియుసంబంధము లేదనియుఁ దెలిసికొన లేకున్నారు. కావుననే యాయనకుఁ గల సాన్నిధ్యమాత్ర సాధ్యకర్తృత్వమును, సాధనసాధ్యకర్తృత్వమునుగా భావించి