పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

-: కథా ప్రారంభము  :-


ఉ. సారబలప్రసార పరిశంసితవింశతిబాహు బాహుకే
    యూర చిరత్నరత్ననికషోపలమౌ రజతాద్రిపై మనో
    హారవిహారము ల్సలిపి యచ్చట నచ్చట విశ్రమించుచుం
    జారువిచారుఁ గింకరవశంకరు శంకరు గౌరి యిట్లనున్. 61

క. చిత్తజహర మీవలనం
    గ్రొత్తకథ ల్గలిగెనేని గోరి వినంగాఁ
    జిత్తం బుత్తలపడియెడి
    నిత్తఱినిం బ్రొద్దువుత్త మెఱిఁగింపఁగదే. 62

క. నావుడు దేవుం డిట్లను
   దేవీ కల వెల్ల నీకుఁ దెలిపితి మొదలన్
   దేవాసుర మానుషముల
   నీవెఱుఁగనియట్టి కథలు నేఁ డిఁక నేవీ! 63

క. ఇప్పటికి భోజునకుఁ గడు
   నొప్పిద మగు మణిమయాసనోపాంతములన్
   ముప్పదియు రెండు బొమ్మలు
   చెప్పిన యాకథలు గలవు చెప్పెద వినుమా. 64

క. అనవుడు నామణి సింహా
    సన మెవ్పరిసొమ్ము భోజజనపతి కేలా
    గునఁ జేరె నేమికారణ
     మున నతనికి నిన్నికథలు బొమ్మలు సెప్పెన్. 65

క. నాకుం జెప్పుఁడు నావుడు
    నా కైలాసంబుపై సుఖాసీనుండై