పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశాశ్వాసము

447


సీ.

అనుడు నాలెంకయు నాశ్చర్యమందుచు
        ధరణీశ నీకు నుదారమతికి
నిప్పటియానతి యొప్పు నట్లయ్యును
        బలికెద నావిన్నపంబు వినుము
పయిలెక్కకాండ్రను గయికొల్పి వెఱపించి
        లెంక విశ్వాసంబు బొంకు చేసి
ధన మెంత గల్గినఁ దాఁ జుల్కఁజూడక
        యాయవ్యయంబుల నడుగవలయు


ఆ.

వాని వివరమెల్ల వర్గువుగాఁ గూర్చి
నెఱయఁదెలుపులెక్క నెఱుఁగుకొనుచు
వ్యయము పుచ్చి నిలువ వ్రాయించి కైకొంట
ప్రభుల కిదియ నీతివిభవ మండ్రు.

95


ఆ.

వ్రాఁతకాని నమ్మరా దర్థగృహముల
నుంచకున్న నేమి యొక్కనాఁడె
వెరసు గూడుమనినఁ గరణము పండిత
న్యాయ మనఁగ నర్థ మచటఁ దెచ్చు.

96


క.

ఒకదెసఁ దెచ్చిన యాయం
బొకదిక్కునఁ జెల్లు వ్రాసి యొకదెస వ్యయ మ
ట్లొకదిక్కునఁ జనవ్రాసిన
బ్రకటంబుగ వాఁడు మిగులఁ బాపాత్ముఁ డగుఁన్.

97


క.

వహి వారణాసి యనఁగా
మహిఁ బరఁగివ దిందుఁ గవటమార్గంబుగ నా
గ్రహమున వ్రాసినవానికి
నిహపరములు లేవు నరక మెదురై యుండున్.

98