పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

448

సింహాసన ద్వాత్రింశిక


గీ.

రానిపైఁడి చెల్లు వ్రాయుట యాయంబు
తక్కువై వ్యయం బదెక్కుడౌట
లెక్క తుడుపువడుట లిపి సందియం బౌట
చెల్లు మఱచుటయును గల్లపనులు.

99


క.

కరణము తనయేలిక కుప
కరణము నిర్ణయగుణాధికరణము ప్రజకు
న్శరణము పగవారలకును
మరణము నాఁ జెల్లు నీతిమంతుం డైనన్.

99


ఉ.

వ్రాలకు సందియంబువడ వ్రాయక మోసము పుట్టనీక గ
ర్వాలసుఁడై సుడిం బడక యప్పటికప్పటి కిష్టబుద్ధితో
నేలిక చిత్తవృత్తిఁ జరియించుచు నుండియు నెద్దియైనఁ ద
త్కాల మెఱింగి చేయునది కార్యము రాజహితాధికారికిన్.

100


క.

అధికారము గైకొని బహు
విధముల నాయమును వ్యయము వినిపింపక యే
యధికారి యడఁచె మఱి వాఁ
డధికారియ కాక పతికి నాప్తుం డగునా.

101


క.

కావున నియ్యెడ నను హిత
సేవకునింగాఁ దలంచి చిత్తములోనన్
భావించిన యట్లైనను
నావిన్నప మవధరింపు నరలోకేంద్రా.

102


వ.

అట్లు కాదేని యెత్తువెరసైన నవధరింపు మని మ్రొక్కి యోవదాన్యశిరోమణి బట్టు పట్టుకొనిచన్న రత్నధనస్వర్ణసంఖ్య చూచిన నేఁబదికోట్లు నలునదిలక్ష లయ్యె ననిన నుల్లంబున సంతసిల్లి.

103