పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340

సింహాసన ద్వాత్రింశిక


దష్టంబై నలుదిక్కులం గొలువఁగాఁ దా నేకసిద్ధక్రియా
హృష్టాత్ముం డగుచు న్మహీవరపరుం డేతెంచె నుజ్జేనికిన్.

81


ఉ.

వింటివె భోజరాజ పలువెంటలఁ బూనియు వాని బోలలే
వంటిఁ బ్రయత్నము ల్వలవదంటి విచారము లుజ్జగించి నీ
కింటికిఁ బోవు టొప్పు నన నిట్టి గుణశ్రవణోత్సవంబునం
గంటకితాంగుఁడై యతఁడు క్రమ్మఱ నేగె గృహాంతసీమకున్.

82


వ.

తదనంతరంబ కొన్ని దివసంబు లరిగిన నిరువదియగువాకిట నెక్కం బూనుకొని.

83


ఇరువదియవబొమ్మకథ

క.

నాగారిగమనమిత్రుని
నాగాననజనకు ననఘు నాగాభరణున్
నాగాసురహరుని సువ
ర్ణాగధనుర్ధరుని నందనాగవిహారిన్.

84


ఉ.

నిష్ఠఁ దలంచి సర్వదరణీసురసమ్మత మైనవేళ భూ
యిష్ఠము లైన వాద్యము లనేకవిధంబుల మ్రోయ నాసన
శ్రేష్ఠము పొంతఁ జేరఁగఁ బసిండి నొనర్చిన బొమ్మ న్యాయవా
ఙ్నిష్ఠురవృత్తి దోఁపఁ బలికెం బృథివీపతి నడ్డపెట్టుచున్.

85


ఉ.

పొందొకయిం తెఱుంగక ప్రభుత్వము సూపెద నష్టభోగసం
క్రందనుఁ డౌ నవంతిపతికైవడి నీగియుఁ దెంపు లేక యె
క్కం దర మౌనె నీవు నినుఁ గానవు గాక తలంచి చూడఁగా
నందని మ్రానిపండులకు నఱ్ఱులు సాఁచుట గాదె భూవరా.

86


ఉ.

ఆతనివర్తనంబు దెలియ న్వినుకోరికి వచ్చినాఁడ వౌ
నీతలఁ పిఫ్డు గంటి ధరణీశ్వర! చెప్పెద నాఁటదాన నా